SRPT: నడిగూడెం మండలం కర్వీరాల క్లస్టర్ పరిధిలోని రైతులందరూ వెంటనే ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేసుకోవాలని ఏఈవో ఉప్పయ్య ఇవ్వాళ సూచించారు. భవిష్యత్తులో పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల లబ్ధికి ఇది తప్పనిసరని తెలిపారు. దీని ద్వారా రైతులకు ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కార్డు లభిస్తుందని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
HNK: వర్దన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు కోరారు. GWMC 45వ డివిజన్ పరిధిలోని తరాలపల్లి గ్రామంలో పోచమ్మతల్లి ఆలయ పునర్నిర్మాణంకు భూమిపూజ, ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి శుక్రవారం MLA భూమిపూజ చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు.
VSP: గత కొన్ని రోజులగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనల నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. గుర్తింపు కార్డు కలిగిన వారిని మాత్రమే విశ్వవిద్యాలయంలోకి అనుమతిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఎస్ఐ మధ్య వివాదం, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ చేసిన నిరాహార దీక్షలు నేపథ్యంలో భద్రతను పటిష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి జుక్కల్కు బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ దినేశ్ తెలిపారు. ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు ట్రిప్పులు ఈ బస్సు రాకపోకలు సాగిస్తుందని, ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
BDK: మణుగూరు మండల పరిధిలోని కమలాపురం గ్రామం సమీప గోదావరి నది నుంచి నిత్యం అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామం మీదగానే ట్రాక్టర్లు అదుపు లేకుండా విపరీత వేగంతో సంచరిస్తుండటం తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లు అక్రమ రవాణా కొనసాగిస్తున్నాయని నేడు స్థానికులు చెబుతున్నారు.
SRD: హత్నూర మండలంలోని నాగులదేవుపల్లిలో గురువారం మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సర్పంచ్ చాముండి శిరీష, సంఘం అధ్యక్షురాలు బాయికాడి లావణ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భ్రమరాంబ, ఉప సర్పంచ్ మాణిక్యం, వార్డు సభ్యులు అరుణ, గణేశ్, మీనా, మాజీ సర్పంచ్ సుధాకర్ పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి ఈ భవనం దోహదపడుతుందని తెలిపారు.
అఫ్గన్ కోచ్గా జొనాథన్ ట్రాట్ పదవి కాలం ముగిసిన నేపథ్యంలో ఆయనకు ప్లేయర్లు భావోద్వేగ వీడ్కోలు పలుకుతున్నారు. జద్రాన్ తన POTM అవార్డును ట్రాట్కు అంకితం చేశాడు. ట్రాట్ నాలుగేళ్లుగా అఫ్గన్ను వెంటుండి నడిపారని, తొలి రోజు నుంచే తమను తీర్చిదిద్దారని నబీ ట్వీట్ చేశాడు. ట్రాట్ కోచింగ్లో అద్భుతంగా గడిపామని, ఆయన వెళ్లిపోవడం కష్టంగా ఉందని రషీద్ పేర్కొన్నాడు.
MDK: కౌడిపల్లి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మిర్జాపూర్ కాయకల్ప బృందం శుక్రవారం సందర్శించింది. ఆసుపత్రిలో పరిశుభ్రత, పచ్చదనం, వార్డుల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి ఆసుపత్రి పనితీరుపై ఆరా తీశారు. వైద్య సేవలు, నిర్వహణ పట్ల సూపరింటెండెంట్ సంతృప్తి వ్యక్తం చేస్తూ డాక్టర్లను అభినందించారు.
GNTR: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను మంత్రి సవిత సందర్శించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి, అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులను సమృద్ధిగా నిల్వ ఉంచాలని అధికారులకు ఆదేశించారు.
NGKL: నాగర్ కర్నూల్ పేరు వెనుక చరిత్ర దాగి ఉంది. పూర్వ కాలంలో నాగన, కందన అనే సోదరులు ఈ ప్రాంతాన్ని ఏలేవారని, వారి పేరు మీదుగా దీనికి నాగన-కందనవోలు అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కాలక్రమంలో వ్యవహారికంలో ఆ పేరు కాస్తా నాగర్ కర్నూల్గా రూపాంతరం చెందింది. నల్లమల అడవులు, ప్రాజెక్టులతో అలరారే ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో జిల్లాగా అవతరించింది.
SKLM: రణస్థలం పంచాయతీ పరిధిలోని గొర్లె వీధిలో ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీరు అందించే పనులకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. రణస్థలం పంచాయతీ సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
PLD: సిమెంట్ ఫ్యాక్టరీల నిర్మాణం పేరుతో రైతుల వద్ద తక్కువ ధరకే భూములు కొన్న యాజమాన్యాలు, ఇప్పటికీ పనులు చేపట్టకపోవడంపై గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు అసెంబ్లీలో శుక్రవారం ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీలు వస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని రైతులు ఆశపడ్డారని, కానీ నేడు అటు పొలం లేక, ఇటు పరిశ్రమలు రాక రైతులు కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
NLG: చిట్యాల నుంచి ఉరుమడ్ల, నేరడ దారుల్లో, పెద్దకాపర్తి లోకి వెళ్లే దారిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటిన హరితహారం వృక్షాలను గుర్తుతెలియని వ్యక్తులు మొండెం వరకు నరికివేశారు. ఏళ్ల తరబడి పెంచిన చెట్లను ఇలా నిర్దాక్షిణ్యంగా రంపంతో కోయడం పట్ల పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
TG: హైదరాబాద్లో భారీ ఆన్లైన్ గేమింగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీల్లో ఈ మాఫియా గుట్టురట్టు అయ్యింది. సిండికేట్తో ఈ ముఠా రూ.13 వేల కోట్ల మోసానికి పాల్పడినట్లు సోదాల్లో వెల్లడైంది. ఫేక్ కేవైపీతో షెల్ కంపెనీల ఆన్బోర్డింగ్ చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న వేల్పుల భీమయ్య అనే ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య మహేష్, కార్పొరేటర్లు సుదమల్ల హరికృష్ణ, విజయరాణి తిరుపతి, మున్సిపల్ అధికారులు సాయికుంటలోని నివాసానికి వెళ్లి భీమయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు.