SRD: పుల్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల” పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం పరిశీలించారు. పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.
CTR: రంజాన్ మాసం ప్రారంభం మైన సందర్భంగా పుంగునూరు పట్టణంలో పేద ముస్లింలకు MM మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో నెల రోజులకు సరిపడా నిత్యవసర సరుకులను శుక్రవారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ అందరు సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని 20 సంవత్సరాల నుంచి చేపడుతున్నట్లు తెలిపారు.
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే తిరు కళ్యాణ మహోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. గత 15 ఏళ్లుగా ఆనవాయితీగా ఆయన కుటుంబం వీటిని సమర్పిస్తుంది. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
VZM: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో గుర్ల మండలం పెద్దబంటుపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం టీచర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
NLG: నకిరేకల్ పట్టణంలోని మొయిన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ స్వామి ఫర్నీచర్ షాపును ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం ప్రారంభించి, యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన వస్తువులను అందించి వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని సూచించారు. మరి కొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.
KDP: ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డులోని సినీ హబ్ మలుపు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జీవరత్నం అనే యువకుడు మృతి చెందాడు. ఖాజీపేట మండలం ఏటూరు గ్రామానికి చెందిన జీవరత్నం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.
MDCL: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) మౌలాలి సర్కిల్ నూతన DGMగా విద్యాసాగర్ వాజపేయి నగర్లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం డిఫెన్స్ కాలనీలోని మేనేజర్ కార్యాలయాన్ని సందర్శించగా, HMW మేనేజర్ నవీన్తో పాటు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.
సత్యసాయి: అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను రాష్ట్ర చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత శుక్రవారం సందర్శించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించి, అందుబాటులో ఉన్న వస్త్రాల స్టాక్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన వస్త్రాలను సమృద్ధిగా నిల్వ ఉంచాలని మంత్రి ఆదేశించారు.
SRD: పుల్కల్ మండలం సింగూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. తరగతి గదులు, పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లు, మెనూ అమలును పరిశీలించారు. అలాగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్ననందున విద్యార్థులు ఏకాగ్రతతో కృషి చేయాలని, పునర్విమర్శ చేయాలని సూచించారు.
MBNR: జడ్చర్ల జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాత బజార్లోనే శంకరయ్య నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాత బజార్లోనే శంకరయ్య నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.
KDP: సిద్దవటం మండలం మాధవరం-1పరిధిలోని బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్బస్టర్ మూవీ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ OTTలోనూ రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలోనే కాదు OTTలో కూడా అదరగుడుతోంది. FEB 11న జీ5లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ మూవీ తాజాగా 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.
PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ శివారులో ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఎస్సారెస్పీ కాల్వ వంతెనపై ఆటో, బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో బోల్తాపడి అద్దాలు పగిలిపోవడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆటో డ్రైవర్ వడ్లూరి చిరంజీవి (36), బైక్పై ఉన్న గజ్జెల సురేష్ (35) తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను పోలీసులు చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు.
VKB: పేదలకు వరం ఇందిరమ్మ ఇల్లు అని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం 2వ వార్డులోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు చింతకాయల మొగులమ్మ గృహప్రవేశానికి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.