భారత ఆటోమొబైల్ పరిశ్రమ రానున్న ఐదేళ్లలో అంతర్జాతీయంగా నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగం గత పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 కోట్లకు వృద్ధి చెందినట్లు వెల్లడించారు. ప్రఖ్యాత గ్లోబల్ ఆటోమొబైల్ బ్రాండ్లు భారతదేశంలో ఉండటం దేశ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని అన్నారు.