TG: రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తరగతి గదులను, క్లాస్ రూముల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.