AP: మాజీ సీఎం జగన్ ఈరోజు అల్లూరి, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి ఆయన వెళ్లనున్నారు. ఇటీవల వివాహమైన గణేష్ కుమారుడు దంపతులను జగన్ ఆశీర్వదించనున్నారు.