ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట లొంగిపోయారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిపై రూ.64 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మన్యంలో మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని, పునరావాసంతో పాటు రివార్డులు అందజేస్తామని ఎస్పీ కోరారు. లొంగిపోయిన వారంతా మావోయిస్టు పార్టీకి చెందిన మార్వార్ డివిజన్ కమిటీ సభ్యులని తెలిపారు.