AP: మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఇవాళ జరగనుంది. ఇందుకోసం ఆయన హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఉదయం 11 గంటలకు హాజరుకానున్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, న్యాయస్థానం ఆదేశాల మేరకు దాదాపు ఆరేళ్ల తర్వాత జగన్ ఈ విచారణకు హాజరవుతున్నారు.