AP: నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని CM చంద్రబాబు అన్నారు. YCP పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ చేసిన వారు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారని తెలిపారు. అబద్దాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించాలని తాపత్రయ పడుతున్నారని చెప్పారు. వారి ప్రయోజనాల కోసం ఎవరినైనా ముంచేందుకు వెనుకాడరని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో చట్టపరంగానే పరిపాలన నడుస్తుందన్నారు.