ప్రధాని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. తమ స్నేహితుల కోసం కేంద్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా వినియోగించడం ఇకనైనా ఆపాలన్నారు. ప్రజలందరీ కోసం ప్రభుత్వ బ్యాంకులు పని చేయాలని సూచించారు. కానీ ప్రభుత్వం వాటిని ధనిక, శక్తివంతమైన సంస్థలకు ప్రైవేట్ ఫైనాన్షియర్లుగా మార్చేశాయని విమర్శించారు.