AP: రాష్ట్రంలో ఇవాళ రేషన్ దుకాణాలను పునఃప్రారంభించారు. పీఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించి మాట్లాడారు. దురుద్దేశంతోనే వైసీపీ హయాంలో రేషన్ షాపులు రద్దు చేశారని మండిపడ్డారు. కూటమి సర్కారు తీసుకున్న మరో మంచి నిర్ణయంతో రేషన్ షాపులు పునఃప్రారంభించినట్లు తెలిపారు. 1.46 కోట్ల రేషన్ కార్డుదారులకు లబ్ధి జరుగుతుందని పేర్కొన్నారు.