TG: హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు సినీ నటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. కాగా దీనిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని గుర్తు చేశారు. మరి చంద్రబాబును అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అని కేఏ పాల్ నిలదీశారు.