పూర్వకాలపు దాడులకు, నేటి క్షిపణి దాడులకు తేడా ఏముంది? అప్పుడు కత్తులు, ఇప్పుడు బాంబులు. ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం అమాయక పసిపిల్లలు, వృద్ధులే. అభివృద్ధి చెందిన దేశాల స్వార్థం వల్ల మానవత్వం మంటగలుస్తోంది. ఆయుధాల దాడిలో సామాన్యుల ఆర్తనాదాలు అరణ్య రోదనలుగా మారుతున్నాయి. మానవత్వం గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఈ ఆధునిక కాలంలో, ఇలాంటి హింసాకాండ నాగరిక సమాజానికి తీరని మచ్చ.