జమ్మూకశ్మీర్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఝజ్జర్ కోట్లి సమీపంలో ప్రయాణికులతో నిండిన బస్సు లోయలో పడిపోయింది.
మణిపూర్ అల్లర్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంఫాల్ చేరుకోవడానికి ముందురోజు భద్రతా బలగాలు, తీవ్రవాదుల కుట్రను విచ్చిన్నం చేశారు.
తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల(cesarean operations) గురించి కీలక విషయం బయటకొచ్చింది. సిజేరియన్ ఆపరేషన్లలో 2021-22లో 55.53 శాతంతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు దేశంలో ఈ సగటు కేవలం 23.29 శాతం ఉండటం చర్చనీయాంశంగా మారింది.
దేశంలో రూ.2వేల నోటు ను నిషేధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఆ నోటీను బ్యాంకులో ఉపసంహరించుకుంటున్నారు. గతవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, సజావుగా సాగుతుందని తెలుస్తోంది.
బళ్లారి నుంచి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మైసూరు సందర్శనకు వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. 10 మంది సంఘటనా స్థలంలోనే దుర్మరణం(10 Died) చెందారు.
నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషి వల్ల అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో రైతులకు జీసీసీ(GCC) సేంద్రియ ధ్రువ పత్రాలను అందించనుంది.
రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోవాలంటే టీఎంసీతోనే సాధ్యమని ఎమ్మెల్యే బేరాన్ అర్థం చేసుకుని మా పార్టీలో చేరాడు. బీజేపీపై చేసే పోరాటంలో భాగంగా మంచి నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ క్యాబ్ సర్వీస్ ఓలా గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈరోజుల్లో దేశంలోని అన్ని నగరాల్లో ఓలా సర్వీసులు ఉన్నాయి. చాలా మంది క్యాబ్ లలో ప్రయాణించాలంటే ఓలానే ఎంచుకుంటారు. కాగా, ఓలా తాజాగా సరికొత్త సర్వీసును అందించడానికి రెడీ అయ్యింది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అగ్నీవీర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైనవారికి నవంబర్ నెల నుంచి శిక్షణ ఉంటుంది. వీరికి మొదటి ఏడాదిలో ప్రతి నెలా రూ.30 వేలు, రెండో ఏడాదిలో రూ.33 వేలు, మూడో ఏడాదిలో రూ.35,500, నాలుగో ఏడాదిలో రూ.40 వేలు వేతనంగా ఇవ్వనున్నారు.
మన చాంపియన్ లతో దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటు. రెజ్లర్లకు అండగా నిలుస్తా. ఈ ఘటనతో ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ మొదటి రోజే వంగిపోయినట్లు అర్థమవుతోంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను బెంగళూరులో వైఎస్ షర్మిల కలిసి అభినందనలు తెలియజేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని ప్రస్తావించారు.
తెలంగాణ అవతరణ ఉత్సవాలు దేశ, విదేశాల్లో కూడా జరుగనున్నాయి. దేశంలోని మధ్యప్రదేశ్, అస్సాంలో అధికారికంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనుండడం విశేషం. ఈ మేరకు అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.
విగ్రహాలు కుప్పకూలాయి. ఆరు దెబ్బతిన్నాయి. మెడ, చేతులు, విరగడంతో పాటు విగ్రహాలు బొక్కబోర్లా పడ్డాయి. ఇక వర్షం ధాటికి చెట్లకు కిందకు చేరిన ప్రజలపై పిడుగు పడింది. దీని ధాటికి ముగ్గురు ప్రాణాలు వదిలారు.