‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో హిట్ అందుకున్న హీరో తిరువీర్ తన తదుపరి సినిమాను లైన్లో పెట్టేశాడు. గంగ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని ఆదివారం పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ మూవీతో భరత్ దర్శన్ దర్శకుడిగా టాలీవుడ్కు పరిచయం కానుండగా.. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది.