విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబోలో తెరకెక్కిన ‘డియర్ కామ్రేడ్’ మూవీ బాలీవుడ్లో రీమేక్ కాబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ‘ధర్మ ప్రొడక్షన్స్’ బ్యానర్పై ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది, ప్రతిభా రంతా ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది.