బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై సంచలన ఆరోపణలు చేశారు. వేరే వ్యక్తితో పడుకోవాలని, అసహజ శృంగారం కోసం భర్త వేధించాడని గృహహింస కేసు పెట్టారు. తన నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడని, పిల్లల ముందే తనను కొట్టేవాడని ఆమె వాపోయారు. భర్త పెట్టిన చిత్రహింసలకు గాను తనకు రూ.50 కోట్లు పరిహారం ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు.