• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »international

ధోనీ ముద్దుల కూతురికి మెస్సీ అదిరిపోయే గిఫ్ట్…!

ఫుట్ బాల్ లెజెండరీ ప్లేయర్ మెస్సీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మెస్సీకి ఇప్పుడు అభిమానులు ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా మెస్సీని విపరీతంగా అభిమానిస్తాడు. ధోనీ కుమార్తె జీవా ధోనీ కూడా మెస్సీ అభిమానిగా మారింది. చిన్న వయసులోనే తండ్రిలాడే ఫుట్‌బాల్ క్రీడను బాగా ఎంజాయ్ చేస్తోంద...

December 28, 2022 / 05:39 PM IST

కరోనాను మించిన వ్యాధి… మెదడు తినే అమీబా.. వ్యక్తి మృతి..!

ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. కాస్త తగ్గుముఖం పట్టిందనుకునేలోపు.. బీఎఫ్7 రూపంలో కొత్త వేరియంట్ కలకలం రేపడం మొదలుపెట్టింది. దీనికే ప్రజలు భయపడుతుంటే… తాజాగా కొత్తరకం మరో వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇది మరింత ప్రమాదకారిగా తెలుస్తోంది. మెదడు తినే అమీబా ఒకటి కొత్తగా పుట్టుకు వచ్చింది. దీని కారణంగా దక్షిణ క...

December 27, 2022 / 11:04 PM IST

సాయానికి సిద్ధం: ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ

భారత్ జీ20 సదస్సుకు హోస్ట్‌గా వ్యవహరిస్తోందని, ఇలాంటి సమయంలో భారత్ తన శాంతి ఫార్ములాను ముందుకు తీసుకు వెళ్లాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్ సంభాషణ సందర్భంగా సూచించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో జీ20 సదస్సు జరగనుంది. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా, జెలెన్‌స్కీ… మోడీతో ఫోన్‌లో సంభాషించారు. అనంతరం ఆయన ఫోన్ ద్వారా మ...

December 27, 2022 / 03:59 PM IST

చైనాలో రోజుకు లక్షల్లో కేసులు, మాస్కులు ధరించాలని కేంద్రం సూచన

చైనాలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇక్కడ రోజుకు లక్షల కేసులు నమోదవుతున్నాయి. షాంఘైకి సమీపంలోని ప్రముఖ ఇండస్ట్రియల్ ప్రావిన్స్ జెజియాంగ్ నగరంలోనే ప్రతిరోజు పది లక్షల కేసుల వరకు వెలుగు చూస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్ది కేసులు పెరుగుతున్నాయని ఆదివారం నాడు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత, చైనాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చైనాలో మూ...

December 27, 2022 / 11:36 AM IST

మంచు తుఫానుతో అమెరికా గజగజ

అమెరికా మంచు తుఫానుతో వణికిపోతోంది. ఈ చలికాలంలో భారీగా కురుస్తున్న మంచుకు తోడు గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్‌లలోకి పడిపోయాయి. అమెరికాలో 200 మిలియన్లకు (20 కోట్లు) పైగా అమెరికన్లపై ఈ మంచు తుఫాను ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారు. 1.5 మిలియన్లకు పైగా ప్రజలు విద్యుత్ లేక అల్లాడుతున్నారు. శుక్రవారం వేలాది విమానాలు రద్దయ్యాయి. టెక్సాస్ నుండి క్యూబెక్ వరకు 3200 కిలో మీ...

December 24, 2022 / 06:51 PM IST

ఫోర్బ్స్ జాబితాలో పీవీ సింధు…!

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కి ఫోర్బ్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. ఇప్పటి వరకు సింధు… తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన ఆటతో… దేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలను తీసుకువచ్చింది.  కాగా…. మంచి ఆట తీరును ప్రదర్శిస్తూ.. ప్రశంసలను దక్కించుకుంటున్న సింధు సంపాదనలో దూసుకెళుతోందని ఫోర్బ్స్-2022 జాబితా చూస్తే అర్థమవుతుంది. ప్రతి యేటా మాదిరిగానే ఫోర్బ్స్ ఈ ఏడాది అత్యధిక మొత్...

December 24, 2022 / 06:32 PM IST

ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య… మూడో పెళ్లి… ఫోటోలు వైరల్..!

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్… మూడో వివాహం చేసుకున్నారు. వయసులో తనకన్నా 13ఏళ్లు చిన్నవాడు అయిన మిర్జా బిలాల్ అనే యువకుడిని ఆమె వివాహం చేసుకున్నారు. అతను యాక్టర్, మోడల్ కావడం గమనార్హం.  తమ పెళ్లి ఫోటోలను రేహమ్ ఖాన్…. సోషల్ మీడియాలో షేర్ చేశారు. రెహమ్ ఖాన్ భర్త మీర్జా బిలాల్ పాకిస్తాన్ మూలానికి చెందినవాడు. కానీ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. మీర్జా బ...

December 23, 2022 / 11:06 PM IST

భారత్‌లోను ఒమిక్రాన్ బీఎఫ్ 7 కేసులు, జాగ్రత్తలు పాటించండి

చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 భారత్‌లోను వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్‌లో మూడు నమోదయ్యాయి. ఇప్పటికే అక్టోబర్ నెలలో గుజరాత్‌లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లో గుర్తించగా, తాజాగా మూడు కేసులు వెలుగు చూశాయి. గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒకటి నమోదయింది. ఒమిక్రాన్ (బీఎఫ్ 5)కు సబ్ వేరియంట్ బీఎఫ్ 7. ఈ వేరియంట్‌కు బలమైన ఇన్‌ఫెక్ష...

December 29, 2022 / 03:30 PM IST

2022లో గ్లోబల్ ట్రేడ్ వ్యాల్యూ 12 శాతానికి పైగా జంప్

ప్రపంచ ట్రేడ్ వ్యాల్యూ సరికొత్త గరిష్టానికి చేరుకుంటోంది. 2023లో తిరిగి మందగమనం ఉండవచ్చుననే ఐక్య రాజ్య సమితి అంచనాలకు ముందు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ ట్రేడ్ వ్యాల్యూ 12 శాతానికి పెరిగి, 32 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని తెలిపింది. ఎనర్జీ ఉత్పత్తుల ట్రేడ్ భారీగా పెరగడంతో ట్రేడ్ గ్రోత్ వృద్ధి కనిపిస్తోందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ తన ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్‌లో మంగళవారం తెలిపింది...

December 15, 2022 / 12:49 PM IST

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత: ఇండియాకు మద్దతుగా అమెరికా

భారత్-చైనా మధ్య ఈ నెల 9వ తేదీన జరిగిన ఘర్షణ విషయంలో అగ్రరాజ్యం అమెరికా భారత్ వైపు నిలిచింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత్ తీసుకునే ప్రతి చర్యకు తాము మద్దతు ఇస్తామని అమెరికా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో ఎల్ఏసీ వెంబడి భారత్-చైనా ఘర్షణను యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ డిఫెన్స్ పరిశీలిస్తోందని పెంటగాన్ తెలిపింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా బలగాలు నిత్యం ఎల్ఏసీ వెంట తచ్చాడటం, సైనిక,...

December 14, 2022 / 05:26 PM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్..!

ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . ఆండ్రూ ఫింట్లాఫ్ కారు ప్రమాదానికి గురికావడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కొంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు. బీబీసీ షో టాప్ గేర్ కోసం షూటిగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. అతని ప్రమాదం గురించి బీబీసీ ముందుగా ప్రకటన విడుదల చేసింది...

December 14, 2022 / 03:41 PM IST

భారత్-చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తత, ఇరువైపుల సైనికులకు గాయాలు

అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో వాస్తవాదీన రేఖ వెంట ఈ నెల 9వ తేదీన భారత్ – చైనా మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ఇరుపక్షాలు గాయపడ్డాయి. ఈ మేరకు భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. ఎంతమందికి గాయాలైన విషయం తెలియాల్సి ఉంది. అయితే మొదట్లో ఆరుగురికి గాయాలైనట్లుగా నివేదిక రాగా, ఆ తర్వాత ఈ సంఖ్య ఇరవైకి చేరుకుంది. అయితే గాయపడినవారు చైనా సైనికులే అధికమని తెలుస్తోంది. [&hel...

December 13, 2022 / 08:03 PM IST

ఇండోనేషియాలో భారీ భూకంపం… 44మంది దుర్మరణం…!

ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో 44 మంది దుర్మరణం చెందగా మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలు పై  దీని తీవ్రత 5.6గా గుర్తించారు. భూకంపం కారణంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం సంభవించే సమయంలో జనాలు పరుగులు తీశారు. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు కుంగిపోయాయి. అధికార యంత్రాంగం రంగంలో దిగింది. సహా...

November 21, 2022 / 04:45 PM IST

వాట్సాప్ లో కొత్త ఫీచర్…ఒకే నెంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్..!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పటి వరకు మనం ఫోన్ లో వాట్సాప్ ఉపయోగించాం. ఫోన్ సహాయంతో… డెస్క్ టాప్ వాట్సాప్ ఉపయోగించి ఉంటాం. కానీ.. ఒకే ఫోన్ నెంబర్ తో.. రెండు ఫోన్ లలో వాట్సాప్ ని ఉపయోగించుకునే ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌ల బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ ఇంకా అందుబాటులోక...

November 16, 2022 / 04:22 PM IST

మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా… డోనాల్డ్ ట్రంప్…!

తాను మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ప్రకటించారు. 2024 లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వైట్‍హౌస్ పీఠాన్ని దక్కించుకునేందుకు రేసులో ఉంటానని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల పోటీ కోసం అమెరికా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‍కు పత్రాలు సమర్పించారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో  రిపబ్లికన్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయ...

November 16, 2022 / 01:58 PM IST