KDP: పోరుమామిళ్ల పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దీపావళి సందర్భంగా అమ్మవారికి ధనలక్ష్మి పూజ చేశారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పూజా అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
TG: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రమైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి వైభవంగా షురూ కానున్నాయి. ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్మాపూర్కు సమీపంలో ఉంటుంది. పేదల తిరుపతిగా ఈ క్షేత్రానికి ప్రసిద్ధి. ఈ బ్రహ్మోత్సవాల్లో వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. నెలరోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి పలు రాష్ట్రాల నుంచి భక్తులు...
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. దీంతో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఆలయానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖుల మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిన్న ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించలేదు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి దీపావళి పర్వదినాన గురువారం అభిషేకార్చనలు ఘనంగా నిర్వహించారు. వేకువ జామున సుప్రభాత సేవ, అనంతరం నిజాభిషేకం, సహస్రనామార్చనలు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా వివిధ రకాల పుష్పాలు తులసి దళాలతో అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది, భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
సాధారణంగా మన దేశంలో పండగలు ఏదో ఒక మతానికి చెందినవి ఉంటాయి. కానీ, దీపావళి మాత్రం ఒక మతానికే పరిమితం కాదు.. అన్ని మతాల వారు జరుపుకునే అరుదైన పండగ. అమావాస్య రోజున జరుపుకునే వెలుగుల వేడుకను దీపావళి అంటారు. ఇవాళ ఊరూరా.. ఇంటింటా ముంగిళ్లలో అసంఖ్యాకంగా దీపాలు వెలుగుతాయి. దీంతో అమావాస్య రాత్రి పున్నమిని మించిన వెలుగులు కనిపిస్తాయి.
JGL: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బుధవారం రూ.1,25,713 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఈఓ సంకటాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. వివిధ కార్యక్రమాల టికెట్ల ద్వారా రూ.67,791 రాగా, ప్రసాదాల ద్వారా రూ.40,700, అన్నదానం ద్వారా రూ.17,222 వచ్చినట్లు పేర్కొన్నారు.
దీపావళి పర్వదినం తెల్లవారుజామున తలకు నువ్వుల నూనె పెట్టుకొని తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యకరం, మంగళప్రదం. ఇవాళ చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపచేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితం ఇస్తుందని పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం విధిగా లక్ష్మీపూజ చేయాలి.
హిట్ టీవీ యూజర్లకు దీపావళి శుభాకాంక్షలు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే, లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగొచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి జరుపుకున్నారని రామాయణం చెబుతోంది.
CTR: పుంగనూరు గ్రామ దేవత శ్రీ విరుపాక్షి మారమ్మకు శనివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారి విగ్రహాన్ని పాలతో అభిషేకించి పసుపు, బంతిపూలు, రోజాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
AP: తిరుమలలో అక్టోబర్ 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. దుర్గా నవరాత్రుల వేళ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయశుద్ధి కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కాగా, అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
AP: విజయనగరం జిల్లాలోని రామనారాయణంలో రామాయణ మాహా సదస్సు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ మహా సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రవచనకర్తలు, పండితులు, అధ్యయనకారులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు.
SRD: మనూరు మండలం బోరంచలో నల్ల పోచమ్మకు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థిర వాసరే పురస్కరించుకొని అర్చకులు సిద్దు స్వామి మూలవిరాట్ దేవికి పంచామృతాలు, మంజీరా నది గంగాజలంతో అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణలో విశేష పూజలు చేపట్టారు. అమ్మవారిని కొలిచేందుకు దూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల దివ్య క్షేత్రంలో వన దుర్గ భవాని మాతకు శనివారం రాజగోపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో రుత్వికులు స్థిర వాసరే పురస్కరించుకొని మూలమూర్తి దేవికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం చేసి ప్రత్యేక అలంకరణలో వేదోక్తంగా విశేష పూజలు చేపట్టారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
TG: బతుకమ్మ పండుగలో అతి ముఖ్యమైనది బొడ్డెమ్మ పండుగ. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదురోజుల ముందు బహుళ దశమి తిథి నుంచి.. మరికొన్ని ప్రాంతాల్లో 9 రోజుల ముందు నుంచి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. బతుకమ్మ బిడ్డ బొడ్డెమ్మ అని భక్తుల విశ్వాసం. అందుకే ఇది ఆడబిడ్డలకు ప్రత్యేకం. బాలికలు, పెళ్లి కాని అమ్మాయిలు బొడ్డెమ్మ ఆడుతారు. ఇప్పటికే పల్లెల్లో బొడ్డెమ్మ పండుగ సంబరాలు మొదలు కాగా.. అక్టోబరు 2 నుంచి బతుకమ్మ ...