CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయానికి ఉదయం నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది. దేవీ నవరాత్రుల సందర్భంగా శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారిని ఉదయాన్నే అర్చకులు అభిషేకాలు పూజలు నిర్వహించి, అమ్మవారిని వెన్నతో అలంకరించి భక్తులకు దర్శనం ఇస్తున్నారు.