AP: ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 3 నుంచి కల్పించనున్న దర్శనానికి టీటీడీ అధికారులు రేపు ఉచితంగా టోకెన్లు జారీ చేస్తారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య జారీ చేయనున్నారు.
NLR: కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం పెన్నా నది తీరాన వెలసియున్న శ్రీ కర్మఫలధాత శనీశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఆదివారం గోవర్ధన అమావాస్య సందర్భంగా పూజలు నిర్వహించారు. భక్తులు కూష్మాండ దీపారాధన, కుష్మాండ దిష్టి, కర్మ స్థానాలు, పితృదేవతల తర్పణాలు పూజా కార్యక్రమాలు భక్తులు భక్తితో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
VZM: చీపురుపల్లి శ్రీ కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయ సన్నిధిలో కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా అమ్మవారికి రవి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించారు. సంకుపాలెం గ్రామానికి చెందిన భజన బృందం వారిచే అమ్మవారికి భక్తి గీతాలాపన అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ ఛైర్మన్ ఇప్పిలి సూర్యప్రకాష్, వైస్ ఛైర్మన్ సూరు కుమార్ స్వామి పాల్గొన్నారు.
GDWL: ఇటిక్యాల మండలం బీచుపల్లి కృష్ణా నది తీరాన వెలసిన అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం అమావాస్య ను పురస్కరించుకొని అర్చకులు స్వామికి అభిషేకం, అర్చన, ఆకు పూజ హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య ఆదివారం స్వామి వారికి ఆలయ అర్చకులు మురళి మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించి విశేష అర్చనలు జరిపి మహా నైవేద్యం సమర్పించారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దేవాలయంలో వన దుర్గా భవాని మాతకు ఆదివారం వేకువజాము నుండి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తుల ఇలవేల్పు భవాని మాతకు ప్రత్యేక అలంకరణలతో విశేష అభిషేక పూజలు చేశారు. అనంతరం మంగళ హారతి, దీపం, గుగ్గిల ధూపం, నారికేళ, ఫల నైవేద్యం నివేదన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
NDL: యాగంటి పుణ్యక్షేత్రంలో అర్ధనారీశ్వరునిగా వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి విశేష ద్రవ్య పూజలను నిర్వహించారు. ఆదివారం అమావాస్య కావడంతో అర్చకులు వేదమంత్రాలతో స్వామివారికి పంచామృత, విశేష ద్రవ్య ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల హారతులను నిర్వహించారు. యాగంటి బసవన్నకు విశేష పూజలను నిర్వహించారు.
SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయంలో ఆదివారం భాను వాసరే విశేష పూజ కార్యక్రమాలను ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి చేపట్టారు. అమ్మవారికి పంచామృతాలు, గంగా జలాలతో అభిషేకం చేసి నక్షత్ర హారతి సమర్పించారు. అదేవిధంగా కుంకుమార్చన, ప్రత్యేక ఆరాధన, దీపారాధన చేశారు.
KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక అమ్మవారి శాల వద్ద గురువారం దీపావళి పురస్కరించుకుని ధనలక్ష్మి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేకువజాము నుంచి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి వివిధ రకాల పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
ATP: గుంతకల్లులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం దీపావళి పండుగ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి వేకువ జామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయంలో దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.
MDK: శివంపేట మండల పరిధిలోని సికింద్లపూర్ గ్రామంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం కొండపై లక్ష్మీనృసింహ స్వామి క్షేత్రంలో గురువారం చిత్త నక్షత్రం పురస్కరించుకుని శ్రీ సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్థులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసియున్న గురుదక్షిణామూర్తికి గురువారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన చేసి పూజలు చేశారు. అనంతరం గురు దక్షిణామూర్తికి పాలు, పెరుగు, తేనె, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
E.G: మామిడికుదురు మండలంలోని అప్పనపల్లిలో ఉన్న బాల బాలాజీ స్వామి వారిని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం దీపావళి పండుగను పురస్కరించుకుని సాధువులకు ఆయన వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
E.G: అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీరామ్ శ్రీధర్ కుటుంబ సభ్యులు రూ.17,551 విరాళాన్ని గురువారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యులకు స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు.