KMR: నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి అభయాంజనేయ స్వామి(ఏకశిల)సప్తమ వార్షికోత్సవ వేడుకలను రేపు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త పట్లోల్ల సునీత కిషోర్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మహాభిషేకం ఉంటుందని పేర్కొన్నారు. 108 నది జలాలతో అభిషేకం, మూలమంత్రం పావనము, తమలపాకులతో నాగవల్లి దళ ప్రత్యేక పూజలు చేస్తారు.
BHNG: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి, అమ్మవారికి ఊంజల్ సేవ కార్యక్రమాన్ని శాస్త్రోత్తంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు కూడా పాల్గొన్నారు.
SKLM: క్రిస్మస్ సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని కీస్టోన్ చర్చిలో శనివారం యువ క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు లిడియా జాన్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి నగరంలో ఉన్న ప్రజలంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఈ సందర్భంగా కోరారు.
NZB: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్టి సందర్భంగా శనివారం గంగాస్థాన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఉదయం 6 గంటలకు పంచామృతాలతో అభిషేకం జరగనుందని ఆలయ అర్చకులు సంతోష్ శర్మ తెలిపారు. ఉదయం 9:30 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందిస్తామన్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం షష్ఠి: ఉ. 9-25 తదుపరి సప్తమి ధనిష్ఠ: మ. 3.50 తదుపరి శతభిష వర్జ్యం: రా. 10-41 నుంచి 12-12 వరకు అమృత ఘడియలు: ఉ. 7-20 వరకు దుర్ముహూర్తం: ఉ. 6-20 నుంచి 7.48 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ. 6.21; సూర్యాస్తమయం: సా.5.21 సుబ్రహ్మణ్య షష్ఠి
విజయవాడ ఇంద్రకీలాద్రి పై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కేంద్రమంత్రి సురేశ్ గోపి శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈఓ కేఎస్ రామరావు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ వేదపండితులచే వేదాశీర్వచనం చేశారు.
SKLM: లావేరు మండల కేంద్రంలో ఉన్న స్త్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అర్చకులు ఋషి కుమార్ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలతో, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు గోత్రనామాలతో పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
AP: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. పంచమీతీర్థం సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరుకు సారెకు తీసుకొచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి టీటీడీ ఊరేగింపుగా సారె తీసుకొచ్చింది. అయితే అమ్మవారికి సారె, కుంకుమ, పసుపు, ఆభరణాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. సారెతో పాటు ఆభరణాలను అమ్మవారికి టీటీడీ అలరించనుంది.
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో ఈనెల 21 నుంచి 25 తేదీ వరకు జరగబోయే భవానీ దీక్ష విరమణల బందోబస్తు ఏర్పాటులను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గురువారం పరిశీలించారు. ఆలయ ఇంజినీరింగ్ అధికారులుతో కలిసి హోమ గుండాల ఏర్పాటు, ఇరుముడి పాయింట్లు, అన్నదానం, ప్రసాదం కౌంటర్లు, క్యూలైన్లను పరిశీలించారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం పంచమి: ఉ. 10-48 తదుపరి షష్ఠి శ్రవణ: సా. 4.40 తదుపరి ధనిష్ఠ వర్జ్యం: రా. 8-32 నుంచి 10-04 వరకు అమృత ఘడియలు: ఉ. 6-29 నుంచి 8-03 వరకు తిరిగి తె. 5-47 నుంచి దుర్ముహూర్తం: ఉ. 8-32 నుంచి 9.16 వరకు తిరిగి మ. 12-12 నుంచి 12-56 వరకు రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: […]
కోనసీమ: అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసియున్న విగ్నేశ్వర స్వామిని గురువారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు స్వామివారికి సమర్పించిన వివిధ సేవలు, విరాళాలు ద్వారా రూ.1,26,403 ఆదాయం లభించినట్లు ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు
NLG: పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ఘనంగా హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం గణపతి పూజ, పుణ్యవచనం, కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మురళి గురుస్వామి, శివయ్య గురుస్వామి, రమేష్ గురుస్వామి, కోటేష్ గురుస్వామి, మల్లేష్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
AP: నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం ఈవోగా డిప్యూటీ కలెక్టర్ ఎం శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. శ్రీశైల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలు, మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అనంతరం ఈవో అన్నపూర్ణ భవన్ను సందర్శించారు. అన్నప్రసాదంపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.
BHNG: లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని మహా మండపంలో గురువారం స్వామివారిని అమ్మవార్లను నూతన వస్త్రాలు, పూలతో అలంకరించారు. వేద మంత్ర పారాయణంలో ఉదయం 10గం నుంచి మొదలుకొని సుమారు రెండు గంటల పాటు శ్రీవారి కల్యాణ తంతు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం చవితి: ఉ. 11-49 తదుపరి పంచమి ఉత్తరాషాఢ: సా. 5.09 తదుపరి శ్రవణ వర్జ్యం: రా. 9-04 నుంచి 10-38 వరకు అమృత ఘడియలు: ఉ. 10-46 నుంచి 12-22 వరకు దుర్ముహూర్తం: ఉ. 10-00 నుంచి 10.44 వరకు తిరిగి మ. 2-24 నుంచి 3-08 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ. 6.20; సూర్యాస్తమయం: సా.5.21