సత్యసాయి: కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవ రోజు భక్తులకు శ్రీ పరమపధనాధ అలంకరణలో ఖాద్రీ నృసింహస్వామి దర్శనం ఇచ్చారు. భక్తులు దర్శించుకుని స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు.