కోనసీమ: అయినవిల్లి మండలం అయినవిల్లిలో వేంచేసియున్న విగ్నేశ్వర స్వామిని గురువారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు స్వామివారికి సమర్పించిన వివిధ సేవలు, విరాళాలు ద్వారా రూ.1,26,403 ఆదాయం లభించినట్లు ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు
NLG: పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం ఘనంగా హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం గణపతి పూజ, పుణ్యవచనం, కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మురళి గురుస్వామి, శివయ్య గురుస్వామి, రమేష్ గురుస్వామి, కోటేష్ గురుస్వామి, మల్లేష్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
AP: నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం ఈవోగా డిప్యూటీ కలెక్టర్ ఎం శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. శ్రీశైల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కృషి చేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలు, మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అనంతరం ఈవో అన్నపూర్ణ భవన్ను సందర్శించారు. అన్నప్రసాదంపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.
BHNG: లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని మహా మండపంలో గురువారం స్వామివారిని అమ్మవార్లను నూతన వస్త్రాలు, పూలతో అలంకరించారు. వేద మంత్ర పారాయణంలో ఉదయం 10గం నుంచి మొదలుకొని సుమారు రెండు గంటల పాటు శ్రీవారి కల్యాణ తంతు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం చవితి: ఉ. 11-49 తదుపరి పంచమి ఉత్తరాషాఢ: సా. 5.09 తదుపరి శ్రవణ వర్జ్యం: రా. 9-04 నుంచి 10-38 వరకు అమృత ఘడియలు: ఉ. 10-46 నుంచి 12-22 వరకు దుర్ముహూర్తం: ఉ. 10-00 నుంచి 10.44 వరకు తిరిగి మ. 2-24 నుంచి 3-08 వరకు రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ. 6.20; సూర్యాస్తమయం: సా.5.21
GDL: మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు జరగనున్న మహాకుంభాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు హాజరుకావాలని ఉడిపి పలిమారు పీఠాధిపతి విద్యా దిశ తీర్థ స్వామిని బుధవారం ఆహ్వానించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ ప్రహల్లాద రావు బుధవారం అక్కడికి చేరుకొని స్వామీజీకి ఆహ్వాన పత్రికను అందించారు.
NDL: లోక కళ్యాణం కోసం శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర స్వామి వారికి జ్వాలావీరభద్ర స్వామి వారికి బుధవారం సాయంత్రం విశేష పూజలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మల్లికార్జున స్వామివారి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లికా గుండానికి పక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలా మకుటంతో పది చేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. మహాగణపతి పూజ తదుపరి వీర భద్ర స్వామికి పూజలు చేశారు.
KMM: టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తిరుపతిరావు సహకారంతో అయ్యప్ప స్వాములు శ్రీను ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వాముల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ తిరుపతి రెడ్డి హాజరై ప్రారంభించారు. 41 రోజులపాటు ఎంతో పవిత్ర దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యమని సీఐ తెలిపారు.
KNR: కరీంనగర్ పట్టణంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు నుండి 9వ తేది వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ADB: తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని హరి హర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వాములు బుధవారం అరట్టు కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని పూల మాలలతో అందంగా ముస్తాబు చేసి స్వామి వారిని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి గ్రామంలోని పురవీధుల గుండా డీజే చెప్పుల్ల నడుమ నృత్యలు చేస్తూ స్వామి వారి పల్లకిని ఊరేగింపు చేసారు.
NRPT: మక్తల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో 8 వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న పడి పూజలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ఛైర్మన్ చంద్రకాంత్ గౌడ్ ఎమ్మెల్యే వాకిలి శ్రీహరిని శాలువాతో సన్మానించారు.
AP: శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు TTD చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మందిని నియమించేందుకు సిద్ధమయింది. ఇప్పుడు TTD 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేస్తోంది. సాధారణ రోజుల్లో కన్నా.. వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సాల సమయంలోనూ డిమాండ్కు అనుగుణంగా లడ్డూలను తయారు చేస్తోంది.
AP: శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఇక నుంచి శని, ఆది, సోమవారాలతో పాటు రద్దీ ఉన్న రోజుల్లో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనం, ముఖ మండపంలో కుంకుమార్చనలు నిలిపివేస్తూ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్లో ఈ సేవల టికెట్లు తక్షణమే నిలుపుదల చేయాలని ఈవో ఆదేశించడం సంచలనంగా మారింది.
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వచ్చే ఏడాది మహాకుంభమేళా ప్రారంభంకానుంది. దీని ఏర్పాట్ల కోసం తొలి విడతగా కేంద్రం రూ.1050 కోట్లు విడుదల చేసింది. జనవరి 13 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు ప్రయాగ్ రాజ్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని మహాకుంభమేళా అని యూపీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమన్త రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం తదియ: మ.12-21 తదుపరి చవితి పూర్వాషాఢ: సా.5-11 తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం: రా.1-10 నుంచి 2-46 వరకు అమృత ఘడియలు: మ.12-18 నుంచి 1-56 వరకు దుర్ముహూర్తం: ఉ.11-27 నుంచి 12-11 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.6.19; సూర్యాస్తమయం: సా.5.20