WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 62వ డివిజన్ కాజీపేట విష్ణుపురిలో కొలువుదీరిన శ్వేతార్క మూలగణపతి దేవాలయంలో నేడు 108 కిలోల విభూదితో స్వామివారికి ప్రత్యేక అభిషేకం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో శ్వేతార్కుడికి విభూదితో అభిషేకం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేశ్వర్లు శర్మ, కార్పొరేటర్ రవీందర్ పాల్గొన్నారు.
SRD: మండల కేంద్రమైన చౌటకూర్లోని హనుమాన్ దేవాలయంలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం ఆదివారం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసాను 21సార్లు చదివారు. అనంతరం హనుమంతునికి మన్యసూక్త సహిత అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. స్వామి వారికి మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహించి మంగళ నైవేద్యాలను సమర్పించారు.
WGL: జిల్లా కేంద్రంలోని భద్రకాళీ మాత ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 40 అడుగుల గణపతి విగ్రహానికి నేడు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. 16 రోజులుగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్న అర్చకులు ముగింపు వేడుకలను నిర్వహించారు. పాలాభిషేకం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
TPT: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామలరావు,అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి…బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు.
KKD: శంఖవరం మండలం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కొండపై ప్రతి ఆదివారం జరిగే రథ సేవ కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. రథం వెనుక అడుగులో అడుగు వేస్తూ రథ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ATP: పుట్టపర్తి పట్టణం చిత్రావతి రోడ్డులోని శ్రీదుర్గామాత దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి 12వ తేదీ శనివారం వరకు దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నామని దుర్గామాత ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. పూజలకు భక్తులు సహకరించాలని కోరారు.
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఆదివారం భాద్రపద బహుళ పంచమి తిథి పురస్కరించుకుని ఆలయ అర్చకులు తిరుమలగిరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారికి తులసి దళాలతో అష్టోత్తర శతనామ అర్చన నిర్వహించి మహ నైవేధ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. అలాగే, 25 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,151 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున స్వామి వారికి పంచామృతాలతో ప్రాతః కాలం పూజలు నిర్వహించారు. భాను వాసరే పంచమి పురస్కరించుకొని పార్వతి సహిత సంగమేశ్వర స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఈ రోజు సెలవు దినం కావడంతో జిల్లాలోని నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చి తమ ఆరాధ్య దేవుణ్ణి దర్శించుకుంటున్నారు.
CTR: భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి అని భక్తుల నమ్మకం. ఆదివారం లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో వెలసిన శ్రీ గంగమ్మ తల్లికి గ్రామ బోనాల సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. మార్చి నెలలో జరిగే గంగమ్మ జాతరను తలపించేలా ఈ గ్రామ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
CTR: పిచ్చాటూరు మండలం వెంగళత్తూరులో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా శనివారం సాయంత్రం గణనాథునికి పంచామృతములతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామి వారికి ప్రీతిపాత్రమైన గరిక మాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ధూపదీప నైవేద్యములు సమర్పించి పంచహారతులు అందజేశారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; వర్ష రుతువు, భాద్రపదమాసం, బహుళపక్షం పంచమి: రా. 9-21 తదుపరి షష్ఠి భరణి: ఉ. 6-32 కృత్తిక తె. 5-23 తదుపరి రోహిణి వర్జ్యం: సా. 5-57 నుంచి 7-28 వరకు అమృత ఘడియలు:.రా. 3-05 నుంచి 4-37 వరకు దుర్ముహూర్తం: సా. 4-19 నుంచి 5-07 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ. 5.52; సూర్యాస్తమయం: సా.5.56.
CTR: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం సంకటహర గణపతి వ్రతం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం సామూహికంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
TPT: తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం సాయంత్రం కాణిపాకం లడ్డు పోటులో తనిఖీలు నిర్వహించారు. నెయ్యి నిల్వ, తయారీ విధానం గురించి ఆరా తీశారు. నెయ్యిని క్వాలిటీ టెస్టింగ్ కొరకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ సెంటర్కు పంపించాలని అధికారులను ఆదేశించారు.
TPT: కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 27న సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, కార్యక్రమాలను నిర్వహించనున్నారు.