TPT: పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2025 జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం.
BHNG: భువనగిరి ఖిలాగుట్ట సంతోషిమాత సీతారామఆంజనేయ స్వామి పునప్రతిష్ట కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొనిగురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో సంతోషిమాతా సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ తాడెం రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ మాయదశరథ, కౌన్సిలర్ వడిచెర్లకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల దివ్య క్షేత్రంలో వన దుర్గమ్మకు శుక్రవారం పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం పూజలు చేశారు. పలు విధ ద్రవ్యాలు, నిమ్మకాయలు, గాజులు, పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించి, రకరకాల సుగంధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ధూప, దీపం, పండ్లు, ఫలాలు నైవేద్యం సమర్పించి మంగళహారతి చేశారు.
MDK: గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో గురువారం ఆలయం హుండీ లెక్కింపు నిర్వహించారు. సంగారెడ్డి డివిజనల్ ఇన్స్పెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో హుండీని లెక్కంచగా 78 రోజుల హుండీ ఆదాయం రూ.15,35,063 వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శశిధర్ గుప్తా, భ్రమరాంబ సేవా సమితి వారు సభ్యులు నాయకులు ప్రతాప్ రెడ్డి, లక్ష్మీనారాయణ ఉన్నారు.
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; హేమంత రుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం త్రయోదశి: సా. 6-17 తదుపరి చతుర్దశి భరణి: ఉ.6-49, కృత్తిక తె. 5-28 తదుపరి రోహిణి వర్జ్యం: సా. 6-08 నుంచి 7-39 వరకు అమృత ఘడియలు: తె. 3-12 నుంచి 4-42 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-36 నుంచి 9-20 వరకు తిరిగి మ. 12-16 నుంచి 1-00 వరకు రాహుకాలం: మ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ. 6.25; […]
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హనుమత్ వ్రత్ ఉత్సవాలు సందర్భంగా టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికారి ప్రతినిధి, గుంతకల్లు పట్టణ యువ నాయకుడు పవన్ కుమార్ గౌడ్ స్వామివారి ఇరుముడి సమర్పించారు. ముందుగా పట్టణంలోని హనుమాన్ సర్కిల్ నుండి కసాపురం ఆలయం వరకు కాలినడకన వచ్చి స్వామివారికి ఇరు ముడి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
E.G: మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. అమలాపురం దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీదారు రామలింగేశ్వరరావు, ఆలయ ఈవో సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. 42 రోజులకు హుండీల ద్వారా 33 లక్షల 35 వేల 485 రూపాయలు ఆదాయం వచ్చిందని 20 గ్రాములు బంగారం, 120 గ్రాములు వెండిని భక్తులు హుండీలో కానుకలుగ సమర్పించారు.
SRD: గుమ్మడిదల మండల కేంద్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద శ్రీ అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి గురువారం ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నాయకులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అయ్యప్ప కృపతో మండల ప్రజలు ఆనందంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
AP: టీటీడీ నూతన పాలక వర్గం నూతన పాలక వర్గం పలు సంస్కరణలు, నిబంధనలు అమల్లోకి తీసుకొస్తోంది. డ్యూటీలో ఉన్న ఉద్యోగులు నేమ్ ప్లేట్తో ఉన్న బ్యాడ్జీని ధరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. బ్యాడ్జీని ధరించడం ద్వారా భక్తులతో దురుసుగా ప్రవర్తించే అధికారుల పేరు తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఈ నెల 24 ఆమోదించి అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ATP: గుంతకల్లు పట్టణంలో హనుమత్ వ్రత్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంజనేయస్వామి దీక్షాపరులు గురువారం పట్టణంలోని హనుమాన్ సర్కిల్ నుండి కసాపురం ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి పురవీధుల గుండా ఊరేగింపు చేశారు.
తిరుమలలో భారీ వర్షాల కురుస్తోన్న నేపథ్యంలో TTD అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, జపాలి, వేణుగోపాల స్వామి వారి ఆలయం మార్గంతో పాటు శ్రీవారి పాదాల మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక వాటిని తిరిగి తెరుస్తామని అధికారులు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
శబరిమల ఆలయానికి అయ్యప్ప స్వాముల రద్దీ పెరిగింది. కార్తీకమాసం పూర్తి అవడంతో మాలలు విరమించుకునేందుకు అయ్యప్ప స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పంబ నుంచి సన్నిధానం వరకు స్వాములు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.
శబరిమల ఆలయానికి అయ్యప్ప స్వాముల రద్దీ పెరిగింది. కార్తీకమాసం పూర్తి అవడంతో మాలలు విరమించుకునేందుకు అయ్యప్ప స్వాములు శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పంబ నుంచి సన్నిధానం వరకు స్వాములు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం హనుమాత్ వ్రత్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి మాలాదారులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా స్వామివారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.