• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »భక్తి

బొడ్డెమ్మ ఎందుకు చేసుకుంటారు?

తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ. మహిళలు బతుకమ్మకు ఎంత ప్రాధాన్యతనిస్తారో బొడ్డెమ్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డెమ్మ పున్నమి అంటారు. తెలంగాణలో ఇప్పటికే ఈ వేడుకలు మొదలయ్యాయి. బొడ్డెమ్మను ఒక పీటపై మట్టితో చేసి పందిరి వేసి పలు రకాల పూలతో అలంకరిస్తారు. తమ వైవాహిక జీవితం బాగుండాలని పసుపు కుంకుమలతో పూజించి 9వరోజు చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి ...

September 24, 2024 / 06:00 AM IST

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి శ్రీనివాస్

VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా అక్టోబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రభుత్వం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ప్రభుత్వ పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే.

September 24, 2024 / 04:01 AM IST

సెప్టెంబర్ 24: మంగళవారం పంచాంగం

శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; వర్ష రుతువు, భాద్రపదమాసం, బహుళపక్షం సప్తమి: సా. 6-04 తదుపరి అష్టమి; మృగశిర: తె. 3-50 తదుపరి ఆర్ద్ర వర్జ్యం: ఉ. 9-53 నుంచి 11-27 వరకు; అమృత ఘడియలు: రా. 7-15 నుంచి 8-49 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-16 నుంచి 9-04 వరకు తిరిగి రా. 10-41 నుంచి 11-29 వరకు; రాహుకాలం: సా. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం: ఉ. 5.52; సూర్యాస్తమయం: సా.5.54

September 24, 2024 / 02:10 AM IST

అన్నవరం ప్రసాదంపైనా అనుమానాలు

తిరుపతి లడ్డూ నాణ్యతపై వివాదం కొనసాగుతున్న వేల అన్నవరం ప్రసాదంలో వినియోగించే నెయ్యిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికి లక్ష కేజీలకుపైగా నెయ్యి అవసరమయ్యే అన్నవరం దేవస్థానానికి  ఏలూరు రైతు డైరీ నుంచి కిలో నెయ్యి రూ.538లకు సరాఫరా చేస్తున్నారు. అదే డైరీ విశాఖలోని సింహాచలం దేవస్థానానికి కిలో నెయ్యి రూ.385లకు అందిస్తోంది. ఒకే కంపెనీ రెండు దేవాలయాలకు వేర్వేరు ధరలకు సరాఫరా చేస్తుండడంతో పలు అను...

September 23, 2024 / 05:00 PM IST

సింహాచలం ప్రసాదంపైనా అనుమానాలు

తిరుపతి లడ్డూ నాణ్యతపై వివాదం కొనసాగుతున్న వేళ సింహాచలం ప్రసాదంలో వినియోగించే నెయ్యిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికి లక్ష కేజీలకుపైగా నెయ్యి అవసరమయ్యే అన్నవరం దేవస్థానానికి ఏలూరు రైతు డైరీ నుంచి కిలో నెయ్యి రూ.538లకు సరాఫరా చేస్తున్నారు. అదే డైరీ విశాఖలోని సింహాచలం దేవస్థానానికి కిలో నెయ్యి రూ.385లకు అందిస్తోంది. దీంతో ఒకే కంపెనీ రెండు దేవాలయాలకు వేర్వేరు ధరలకు సరాఫరా చేస్తుండడంతో పలు అన...

September 23, 2024 / 05:00 PM IST

అన్ని దోషాలు పోయాయి: TTD

AP: శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేశామని TTD తెలిపింది. ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొంది. ‘స్వామివారికి మహానైవేద్యం పూర్తి చేశాం. దోషం కలిగిందన్న భావన లేకుండా సంప్రోక్షణ చేశాం. పూర్ణాహుతితో అన్నీ దోషాలు తొలగుతాయి. ఇటీవల తెలిసీ, తెలియక చేసిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాంR...

September 23, 2024 / 11:29 AM IST

అన్నీ దోషాలు పోయాయి: TTD

AP: శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేశామని TTD తెలిపింది. ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొంది. ‘స్వామివారికి మహానైవేద్యం పూర్తి చేశాం. దోషం కలిగిందన్న భావన లేకుండా సంప్రోక్షణ చేశాం. పూర్ణాహుతితో అన్నీ దోషాలు తొలగుతాయి. ఇటీవల తెలిసీ, తెలియక చేసిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాంR...

September 23, 2024 / 11:29 AM IST

BREAKING: టీటీడీ టికెట్లు విడుదల

AP: డిసెంబర్ నెల కోటాకు సంబంధించి అంగ ప్రదక్షిణం టోకెన్లను ఈ ఉదయం 10గంటలకు టీటీడీ విడుదల చేసింది. 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగులకు దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. కాగా.. రేపు ఉదయం 10గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3గంటలకు వసతి గదుల కోటా టికెట్లు విడుదల కానున్నాయి. 

September 23, 2024 / 10:38 AM IST

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యల తరలివచ్చారు. సోమవారం పరమశివుని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

September 23, 2024 / 10:28 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. నిన్న 82,406 మంది స్వామివారిని దర్శించుకోగా 31,151 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమర్పించారు. టికెట్లు లేని భక్తులకు 6 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది.

September 23, 2024 / 09:14 AM IST

తిరుమలలో ప్రారంభమైన శాంతి హోమం

AP: తిరుమలలో ఏర్పడిన దోషాలు తొలగించేందుకు చేపట్టిన శాంతిహోమం ప్రారంభమైంది. ఇవాళ 6 గంటలకు హోమం ప్రారంభమైంది. బంగారుబావి వద్ద యాగశాలలో శాంతిహోమం, పంచగవ్వ ప్రోక్షణ నిర్వహిస్తున్నారు. గోవుపాలు, గోమూత్రం, నెయ్యి, పెరుగు, పేడతో ఆరాధన చేస్తున్నారు. దీంతో ఆలయం శుద్ధి అవుతుందని ఆగమ సలహామండలి నిర్ణయించింది. కాగా, లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామ...

September 23, 2024 / 06:55 AM IST

యాదాద్రి రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం

BHNG: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామికి సోమవారం సందర్భంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివుడిని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించి, విభూతితో అలంకరణ చేసి అర్చించారు.

September 23, 2024 / 06:49 AM IST

సెప్టెంబర్ 23: సోమవారం పంచాంగం

శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; వర్ష రుతువు, భాద్రపదమాసం, బహుళపక్షం షష్ఠి: రా. 7-32 తదుపరి సప్తమి రోహిణి: తె. 4-26 తదుపరి మృగశిర వర్జ్యం: రా. 8-44 నుంచి 9-17 వరకు అమృత ఘడియలు: రా. 1-21 నుంచి 2-53 వరకు దుర్ముహూర్తం: మ. 12-17 నుంచి 1-05 వరకు తిరిగి 2-42 నుంచి 3-30 వరకు రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 5.52; సూర్యాస్తమయం: సా.5.55

September 23, 2024 / 03:02 AM IST

రేపు తిరుమలలో శాంతియాగం

AP: లడ్డూ ప్రసాదం అపవిత్రంపై రేపు తిరుమలలో శాంతియాగం చేయనున్నారు. విమాన ప్రాకారం దగ్గర యాగశాలలో రేపు ఉదయం 6 గంటల నుంచి శాంతియాగం ప్రారంభంకానుంది. తర్వాత అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించనున్నారు. ఇందుకోసం మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఈ యాగంలో 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొననున్నారు. దేవాదాయ శాఖ తరఫున అన్ని ఆలయాల్లోనూ హోమాలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 

September 22, 2024 / 08:32 PM IST

BREAKING: లడ్డూ అపవిత్రంపై సిట్ ఏర్పాటు

AP: తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రంపై ఐజీ స్థాయి అధికారితో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. లడ్డూ అపవిత్రానికి గల కారణాలతోపాటు అధికార దుర్వినియోగంపైనా సిట్ విచారణ జరపనుంది. సిట్ నివేదిక ఆధారంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంలో భాగమైన ఏ ఒక్కరినీ వదిలేది లేదని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.

September 22, 2024 / 08:26 PM IST