HNK: హన్మకొండలో ప్రసిద్ధిగాంచిన శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు బుధవారంతో మూడవ రోజుకు చేరాయి. ఈ క్రమంలో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు వేద పండితులు నాగిళ్ళ షణ్ముఖ అవధాని తెలిపారు. మూలమూర్తికి షోడశ కలశాలతో మహానారాయణ ఊపనిషత్తుతో అభిషేక కార్యక్రమం నిర్వహించి, చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు.