తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) రాక్షస పాలనతో రాష్ట్రంలో మరో నిరుద్యోగి బలయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1కు ప్రిపేరైన సిరిసిల్లకు(sircilla telangana) చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా(Kashmir pulwama district)లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 28 మంది గాయపడ్డారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు బోల్తా(bus accident) పడినట్లు తెలుస్తోంది.
ఏపీ(AP)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ దారుణ ఘటనలో ఆరుగురు దుర్మరణం(6 Died) చెందారు. శుక్రవారం సాయంత్రం బొలెరో, ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు విడిచారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం వద్ద ఈ దారుణ ఘటన జరిగింది.
తెలంగాణ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC kalvakuntla kavitha)కు మరో షాకింగ్ న్యూస్ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఈడీ మరోసారి నోటిసులు ఇచ్చిన క్రమంలో తన పిటిషన్ త్వరగా విచారించాలని శుక్రవారం కవిత సుప్రీంకోర్టును(supreme court) విజ్ఞప్తి చేశారు. కానీ కవిత చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
సికింద్రాబాద్(secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex) అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్(CM Kcr) విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించి... మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) విచారణ ఎదుర్కొంటున్న కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాశ్ రెడ్డికి (kadapa mp ys avinash reddy) శుక్రవారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) గట్టి షాక్ తగిలింది.
యూపీ(UP) సంభాల్లోని(Sambhal) చందౌసి ప్రాంతంలో బంగాళదుంప కోల్డ్ స్టోరేజీ పైకప్పు కూలి.. ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో మరో 11 మందిని అధికారులు రక్షించారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(c కుమార్తె ఎమ్మెల్సీ కవిత(MLC kavitha) తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(bjp mp k laxman) అన్నారు. అసలు ఈడీ(ED) విచారణ నుంచి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ కూడా అతీతం కాదని అన్నారు. గతంలో అనేక మంది సీఎం హోదాలో ఉన్న వారు సైతం విచారణలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు.
సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్న లోక్ కాంప్లెక్స్ లో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు.
పాస్ కావడానికి అష్టకష్టాలు పడతారు. ఈ క్రమంలో కాపీయింగ్ కు పాల్పడుతున్నారు. ఈ కాపీయింగ్ పై వినూత్న ఆలోచనలు చేస్తారు. అదే సమయంలో చదువుకుంటే పరీక్ష సులువుగా రాయొచ్చనే విషయాన్ని మరచిపోతారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(brs Mlc kavitha) ఈరోజు ఈడీ(ED) విచారణలో పాల్గొననున్నారు. ఈ కేసు విచారణను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టు(supreme court)ను ఆశ్రయించినప్పటికీ సుప్రీంకోర్టు నిరాకరించడంతో కవిత హాజర ఖరారైంది. మరోవైపు ఈ కేసులో మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు కూడా నేడు కవితతోపాటు ఈడీ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
TSPSCలో అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకానికి సంబంధించిన ప్రశ్నపత్రం లీకేజీ(tspsc question paper leakage) ఘటనపై 48 గంటల్లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai ) ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శికి గవర్నర్ తమిళిసై మంగళవారం లేఖ రాసి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలతోపాటు ...
ఈ సమయంలో ఊరి చివరన గణేశ్ అచేతనంగా పడి ఉన్నాడని సమాచారం అందడంతో కుటంబసభ్యులు అక్కడకు వెళ్లి చూడగా గణేశ్ చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడి జేబులో మంగళసూత్రం ఉండడం గమనార్హం.
మా తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda reddy)ని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాలని ఆయన కుమార్తె సునీత రెడ్డి(Viveka daughter Sunitha Reddy) పేర్కొన్నారు. పులివెందులలో వివేకా ఘూట్ దగ్గర ఆమె కుటుంబ సభ్యులతో కలిసిన నివాళులు అర్పించిన క్రమంలో వెల్లడించారు.