కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విజయవాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుడు బీభత్సం సృష్టించాడు. కారుతో బైక్ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఓ చోట ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే రాజమండ్రి నుంచి విజయవాడ వైపు కారు వెళ్లే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులలో ముగ్గురు మహిళలు ఉండగా, ఓ చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధి...
వికారాబాద్ జిల్లాలో ఓ పారా మెడికల్ విద్యార్థిని అత్యంత దారుణంగా హత్య చేశారు. కాళ్లు, చేతుల నరాలు కోసి.. కళ్లు పొడిచి మర్డర్ చేశారు.
భూషణ్ స్టీల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్ నీరజ్ సింఘాల్ను అరెస్టు చేశారు. 56,000 కోట్ల బ్యాంకు కుంభకోణానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నీరజ్ సింఘాల్ను అరెస్టు చేసింది.
గోల్డ్ స్కీమ్ పేరుతో మహిళల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసి చివరగా తమ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
బ్రిజ్భూషణ్పై మహిళా రెజ్లర్లు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు నోటీసులు ఇచ్చారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు ఆదేశించారు.
అప్సర హత్య కేసులో మరో విషయం బయటికొచ్చింది. అప్సరకు ముందే వివాహం అయినట్లు విచారణలో తేలింది. భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం ఆమె పుట్టింట్లో ఉండగా సాయికృష్ణతో ప్రేమలో పడింది. చివరికి అతని చేతిలోనే ఆమె హత్యకు గురైంది.
పశ్చిమబెంగాల్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మిడ్నాపూర్-హౌరా లోకల్ రైలు ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డిని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ ఈ రోజు విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ప్రశ్నించింది.
సమాజంలో ఆడ పిల్లలకు రక్షణ కరువౌతోంది. రోజు రోజుకీ బాలికలు, మహిళలపపై అత్యాచారాలు ఎక్కువౌతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందా లేదా అనే భయం రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఓ అమాయక బాలికను ఓ సింగర్ దారుణంగా మోసం చేశాడు. కాగా, అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
అప్సర అడ్డు తొలగించుకునేందుకు సాయికృష్ణ నెట్లో సెర్చ్ చేశాడని తెలిసింది. వారం రోజుల ముందే ఓ మనిషిని చంపడం ఎలా అని శోధించినట్టు పోలీసులు చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో పెళ్లికి అంగీకరించనందుకు యువతిపై పట్టపగలు మార్కెట్లో కత్తితో దాడి చేసి హత్య చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
బట్టతల వస్తుందేమోననే భయంతో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు
టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. ఎంతో ఖరీదైన మద్యం బాటిళ్లు, నగదు చోరీ గురైందని ఆయన సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.