ఆన్లైన్ లోన్ యాప్ల వల్ల చాలా మంది వేధింపులు అనుభవించి ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఈ లోన్ యాప్లను 50కి పైగా కేంద్రం బ్యాన్ చేసింది. తాజాగా మరో రెండు యాప్లను క్లోజ్ చేస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉదయం జరిగిన రెండు ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు మృత్యువాత చెందారు. ఆటోను లారీ ఢీకొట్టిన(accident) ఘటనలో ఐదుగురు మరణించగా..బైక్స్(bikes) ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా డ్రగ్స్ తీసుకెళ్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్(hyderabad) ఎయిర్ పోర్టులో అధికారులు పట్టుకున్నారు. ఆ క్రమంలో అతని వద్ద నుంచి ఏకంగా రూ.50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు గురించి అధికారులు మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు.
ఖిచ్డీ కుంభకోణంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ సహాయకుడు సుజిత్ పాట్కర్తో సహా మరో ఆరుగురిపై ఇఓడబ్ల్యు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితులందరిపై భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కేంద్రమంత్రి కౌశల్ కిషోర్(Union Minister Kaushal Kishore) ఇంటి వద్ద ఓ యువకుడు తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అయితే మంత్రి కుమారుడి పిస్టల్తో ఈ ఘటన జరిగింది. ఇంట్లో రక్తంతో తడిసిన మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జనసేన నేతకు అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలున్నట్లు కర్ణాటక పోలీసులు వెల్లడించారు. ఏపీలోని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన వెంకటేష్ను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
ఫేక్ మెస్సేజెస్, కాల్స్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఫేస్ మెస్సేజుల ద్వారా డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఉత్తుత్తి మెస్సేజ్ పెట్టి ఓ నగల వ్యాపారిని బురిడీ కొట్టించారు.
ఓ ఇద్దరు మహిళలు తాము పెంచుకునే చిలుకను చిత్రహింసలు పెట్టి చంపారు. ముద్దుగా మాట్లాడే ఆ చిలుకను అత్యంత పాశవికంగా హతమార్చారు. దీంతో కోర్టు వారికి జైలు శిక్ష విధించింది.
ఆధార్ కార్డు ద్వారా చాలా మంది నగదు విత్ డ్రా చేస్తుంటారు. అలాంటి వారు జాగ్రత్త. ఫింగర్ ప్రింట్స్ ద్వారా కొందరు కేటుగాళ్లు అకౌంట్లో ఉన్న నగదును ఖాళీ చేస్తున్నారు.
ఏనుగుల సంచారంతో చిత్తూరు జిల్లాలోని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా పొలం దగ్గర ఉన్న ఇద్దరు దంపతులపై ఏనుగు దాడి చేయగా..వారు అక్కడికక్కడే మృత్యువాత చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.