NLG: చిట్యాల మండలం నేరడలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వద్ద నిధులు లేవని అధికారులు చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు అండగా ఉంటామని బీజేపీ నేత శంకరాచారి పేర్కొనగా, ఇందిరమ్మ ఇళ్ల హామీపై బాధితులు అసహనం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈవో రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.
NRPT: ఊట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామ ప్రతినిధులు నారాయణపేట విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ నవీన్ను కలిసారు. తక్కువ వోల్టేజ్, లూజ్ లైన్లు, కర్రలపై విద్యుత్ లైన్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్. నర్సిములు, భారతీయ కిసాన్ సంఘం నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
VKB: జిల్లాలో ఒక అరుదైన పెద్ద ఉడుత (Malabar Giant Squirrel) కనిపించింది. కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి, అమ్రాబాద్ అడవిలో తన పరిశోధనలో భాగంగా దీనిని గుర్తించారు. దీనిని శాస్త్రీయంగా రాటుఫా ఇండికా అని పిలుస్తారు. ఇది సుమారు 3 అడుగుల పొడవు, వివిధ రంగులు కలిగి ఉంటుందని తెలిపారు.
MBNR: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మను పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి జీఎన్ శ్రీనివాస్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండల చైర్మన్ బాల కిష్టారెడ్డి, ఇతర యూనివర్సిటీల ఉపకులపతులు ఉన్నారు.
MNCL: ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతి, 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 22న TG-సెట్ నిర్వహించనున్నట్లు కాసిపేట బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
BHNG: వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లాలో బాల్య ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని భువనగిరి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
NLG: మునుగోడు మండలం పలివెలలో చింతకాయలు తెంచుతున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు దొంగిలించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మాద నరేందర్, వల్లెపు సాయిల నుంచి బంగారు గొలుసు, కారు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ రవిని డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు.
KNR: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొత్తగా కార్డులు పొందినవారు, పాత కార్డుల్లో పేరు జత చేసుకున్నవారు ఈ-కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. మీ సమీపంలోని రేషన్ దుకాణంలో e-PoS యంత్రంలో ఉచితంగా చేయించుకోవచ్చని వెల్లడించారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన ఛైర్మన్గా పాలకుర్తి సారంగపాణి శుక్రవారం ఉదయం 11 గంటలకు అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం మున్సిపాలిటీ కార్యాలయంలోని ఛైర్మన్ క్యాబిన్లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరుకానున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కొత్త ఛైర్మన్ను ఆత్మీయంగా స్వాగతించాలని పిలుపునిచ్చారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన ఛైర్మన్గా పాలకుర్తి సారంగపాణి శుక్రవారం ఉదయం 11 గంటలకు అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం మున్సిపాలిటీ కార్యాలయంలోని ఛైర్మన్ క్యాబిన్లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరుకానున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కొత్త ఛైర్మన్ను ఆత్మీయంగా స్వాగతించాలని పిలుపునిచ్చారు.
SRPT: రైతుల అభ్యర్థన మేరకు అదనంగా మూడు రోజులపాటు విడుదల చేసిన గోదావరి నీటిని గురువారం సాయంత్రం నిలిపివేశారు. వారబందీ విధానంలో తిరిగి గోదావరి జలాలను ఈనెల 21న పునరుద్ధరించి 28వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
SRPT: రైతుల అభ్యర్థన మేరకు అదనంగా మూడు రోజులపాటు విడుదల చేసిన గోదావరి నీటిని గురువారం సాయంత్రం నిలిపివేశారు. వారబందీ విధానంలో తిరిగి గోదావరి జలాలను ఈనెల 21న పునరుద్ధరించి 28వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
NZB: జక్రాన్పల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ను గురువారం సాయంత్రం జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, గడువు ముగిసిన మందులను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్ ఉరగుట్ట చెరువు రోడ్డు ప్రాంతంలో వీధి బల్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. విషయాన్ని స్థానికులు నూతన కార్పొరేటర్ గుండా సంతోష్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన గురువారం రాత్రి నూతన బల్బులను ఏర్పాటు చేయించారు. వాటిని ఆ ప్రాంత వాసులతో కలిసి ప్రారంభించగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.