• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘బోధన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి’

WGL: ఖిలా వరంగల్ ఏబీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ సత్య శారద సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల సౌకర్యాలు, బోధన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

February 24, 2026 / 06:02 AM IST

కామారెడ్డిలో నేడు జాబ్ మేళా

KMR: కామారెడ్డిలో నేడు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన సూచించారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.

February 24, 2026 / 06:02 AM IST

ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై కేసు నమోదు

ASF: ఆసిఫాబాద్ MLA కోవలక్ష్మిపై మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో జరిగిన అల్లర్లు, మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో ఇప్పటికే మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్ కాగా, 13 మంది BRS నాయకులపై కేసు నమోదు చేశారు. ఆ గొడవలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను MLA నెట్టేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు.

February 24, 2026 / 06:02 AM IST

నిబంధనల ప్రకారం తుది జాబితా ఎంపిక: కలెక్టర్ రాజర్షి షా

ADB: రేవంత్ అన్న కా సహారా-మిస్కినో కే లియే పథకం కింద ఆర్థిక సహాయం కోసం కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన నిన్న ఇంటర్వ్యూల కార్యక్రమం చేపట్టారు. ఈ పథకం కోసం మొత్తం 67 మంది దూదేకుల, ఫకీర్ కమ్యూనిటీలతో పాటు సామాజికంగా వెనుకబడిన ముస్లింలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం తుది జాబితా ఎంపిక చేస్తామని తెలియజేశారు.

February 24, 2026 / 06:00 AM IST

మైనర్ వాహనం నడిపి పట్టుబడితే యజమానిపై కేసు: SP

ASF: త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌ నిషేధమని, మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ ప్రకటనలో తెలిపారు. లైసెన్స్ లేకపోవడం, నంబర్ ప్లేట్ లేకపోవడం, తప్పుడు నంబర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

February 24, 2026 / 05:24 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు: ఎస్పీ

జగిత్యాల జిల్లాలో రోడ్డు భద్రతకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మైనర్, డ్రంక్&డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి అవసరమైతే లైసెన్సులు రద్దు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటారు.

February 24, 2026 / 05:21 AM IST

నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 43 వాహనాలు సీజ్

KNR: నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాల నంబర్ ప్లేట్లపై కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. వన్ టౌన్ కార్నర్ వద్ద సీపీ గౌష్ ఆలం ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ కరీం ఉల్లా ఖాన్ తనిఖీలు చేపట్టారు. నంబర్ ప్లేట్లు లేనివి, ఫ్యాన్సీ, అస్పష్టంగా ఉన్న 43 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు.

February 24, 2026 / 05:14 AM IST

‘క్రమక్రమంగా పుంజుకుంటున్న బీజేపీ’

MNCL: బెల్లంపల్లిలో BJP క్రమక్రమంగా పుంజుకుంటోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ 34వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన కొక్కేర రామ్మూర్తిని ఆయన కలిసి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేయాలన్నారు.

February 24, 2026 / 05:10 AM IST

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

SRCL: సిరిసిల్ల పట్టణంలో సోమవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తారక రామ్ నగర్ కాలనీకి చెందిన కడవేరు కనకవ్వ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 24, 2026 / 05:09 AM IST

ఆదిలాబాద్‌లో తిరిగి ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు

ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు ఎంపీ గోడం నగేష్ జోక్యంతో పునఃప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎంపీ, అధికారులతో మాట్లాడి ప్రక్రియను పునరుద్ధరించారు. తమకు అండగా నిలిచిన నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 04:13 AM IST

‘గ్రామ అభివృద్ధిలో NRIల సేవలు అభినందనీయం’

SRCL: గ్రామ అభివృద్ధిలో ఎన్నారైల సేవలు అభినందనీయమని వేములవాడ ఐఏఎస్పీ రిత్విక్ సాయి అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఎన్నారైల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో ఉండి కూడా గ్రామాభివృద్ధికి సహాయం చేయవచ్చన్నారు.

February 24, 2026 / 04:12 AM IST

నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం

KNR: హుజూరాబాద్ పట్టణ శివారులోని కే.సీ క్యాంప్ రైతు వేదిక వద్ద మంగళవారం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమం ఉంటుందని ఏఈఓ నిఖిల్ కుమార్ తెలిపారు. యాసంగి పంటల యాజమాన్యం, నిషేధిత HT పత్తి సాగుపై రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు.

February 24, 2026 / 04:01 AM IST

‘నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం’

KNR: హుజూరాబాద్ పట్టణ శివారులోని కే.సీ క్యాంప్ రైతు వేదిక వద్ద మంగళవారం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతు నేస్తం’ కార్యక్రమం ఉంటుందని ఏఈఓ నిఖిల్ కుమార్ తెలిపారు. యాసంగి పంటల యాజమాన్యం, నిషేధిత HT పత్తి సాగుపై రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన సూచించారు.

February 24, 2026 / 04:01 AM IST

‘సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాలి’

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. డీఆర్ఎస్సీ సమావేశంలో ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతులు, బ్లాక్ స్పాట్ల గుర్తింపు, రంబుల్ స్టిప్స్ ఏర్పాటు,సైన్ బోర్డుల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎన్‌హెచ్-63, ఎన్‌హెచ్-563 రహదారులపై సమస్యాత్మక ప్రాంతాలను తక్షణం పరిష్కరించాలని సూచించారు.

February 24, 2026 / 04:00 AM IST

‘మాజీ సొసైటీ ఛైర్మన్ త్వరగా కోలుకోవాలి’

BDK: హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసియన్ అరోరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దమ్మపేట మాజీ సొసైటీ ఛైర్మన్ యెల్లిన రాఘవరావుని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

February 23, 2026 / 10:15 PM IST