KNR: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొత్తగా కార్డులు పొందినవారు, పాత కార్డుల్లో పేరు జత చేసుకున్నవారు ఈ-కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. మీ సమీపంలోని రేషన్ దుకాణంలో e-PoS యంత్రంలో ఉచితంగా చేయించుకోవచ్చని వెల్లడించారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన ఛైర్మన్గా పాలకుర్తి సారంగపాణి శుక్రవారం ఉదయం 11 గంటలకు అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం మున్సిపాలిటీ కార్యాలయంలోని ఛైర్మన్ క్యాబిన్లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరుకానున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కొత్త ఛైర్మన్ను ఆత్మీయంగా స్వాగతించాలని పిలుపునిచ్చారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన ఛైర్మన్గా పాలకుర్తి సారంగపాణి శుక్రవారం ఉదయం 11 గంటలకు అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం మున్సిపాలిటీ కార్యాలయంలోని ఛైర్మన్ క్యాబిన్లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరుకానున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కొత్త ఛైర్మన్ను ఆత్మీయంగా స్వాగతించాలని పిలుపునిచ్చారు.
SRPT: రైతుల అభ్యర్థన మేరకు అదనంగా మూడు రోజులపాటు విడుదల చేసిన గోదావరి నీటిని గురువారం సాయంత్రం నిలిపివేశారు. వారబందీ విధానంలో తిరిగి గోదావరి జలాలను ఈనెల 21న పునరుద్ధరించి 28వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
SRPT: రైతుల అభ్యర్థన మేరకు అదనంగా మూడు రోజులపాటు విడుదల చేసిన గోదావరి నీటిని గురువారం సాయంత్రం నిలిపివేశారు. వారబందీ విధానంలో తిరిగి గోదావరి జలాలను ఈనెల 21న పునరుద్ధరించి 28వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
NZB: జక్రాన్పల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ను గురువారం సాయంత్రం జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, గడువు ముగిసిన మందులను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్ ఉరగుట్ట చెరువు రోడ్డు ప్రాంతంలో వీధి బల్బులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. విషయాన్ని స్థానికులు నూతన కార్పొరేటర్ గుండా సంతోష్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఆయన గురువారం రాత్రి నూతన బల్బులను ఏర్పాటు చేయించారు. వాటిని ఆ ప్రాంత వాసులతో కలిసి ప్రారంభించగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు మందమర్రి సీఐ పర్స రమేశ్ ప్రకటనలో తెలిపారు. ఇందులో సుమన్, మూల రాజిరెడ్డి, అనిల్, లక్ష్మి కాంతులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారంతా పరారీలో ఉన్నారని సీఐ వెల్లడించారు.
HYD: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే రాయలసీమ ఎక్స్ప్రెస్కు బొల్లారం రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మక నిలుపుదల కల్పించారు. ఈరోజు నుంచి తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టాప్ అమల్లో ఉండనుంది. దీంతో స్థానిక ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ లభించనుంది.
KMR: బిచ్కుంద పట్టణంలోని ఏడవ వార్డులో మురికికాలువల్లో నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కౌన్సిలర్ ముజాహిద్ పర్యటించి కార్మికులను అప్రమత్తం చేశారు. అనంతరం నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ప్రజలు అంటురోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరని కౌన్సిలర్ ముజాహిద్ అన్నారు.
MHBD: పెద్దవంగర మండలం పడమటి తండాకు చెందిన ధరావత్ సోమన్న తన కుమారుడు విజయ్ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం క్షణికావేశంలో తండ్రి గొంతుపై కుమారుడు కత్తితో దాడి చేశారు. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ తెలిపారు.
RR: తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలలో నిన్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు చదువు బోధించారు. పలువురు విద్యార్థులు ఒక్కరోజు హెడ్ మాస్టర్, కలెక్టర్ వంటి హోదాల్లో కనిపించారు. ఈ సందర్భంగా ఫోటోలు దిగి తీపి జ్ఞాపకాలను మిగిల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
VKB: ధారూర మండల పరిధిలోని నాగసమందర్లో మరింత కట్టుదిట్టం చేస్తూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం ధారూర్ ఎస్సై సున్నం రాఘవేందర్ ప్రారంభించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ఎంతో దోహదపడతాయని తెలిపారు.
MNCL: యూరియా బుకింగ్ యాప్లో రైతులు ఫోన్ నెంబర్ను లింక్ చేయించుకోవాలని జన్నారం మండలం కవ్వాల్ క్లస్టర్ అక్రమ్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు యూరియా బస్తాల కోసం ఇంకా యాప్లో ఫోన్ నెంబర్ను లింక్ చేయించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో వారికి యూరియా బస్తాలు అందే అవకాశాలు లేదని హెచ్చరించారు. దేవునిగూడెం రైతు వేదికకు రైతులు రావాలని సూచించారు.