• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

దర్వేశీపురంలో రేణుక ఎల్లమ్మ దివ్యదర్శనం

NLG: దర్వేశీపురంలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఆదివారం రాత్రి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఆలయ పూజారి నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, మంగళహారతులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఈవో నాగిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

February 23, 2026 / 09:13 AM IST

‘పాప మృతికి కారణమైన వారిని శిక్షించాలి’

MNCL: నాగర్ కర్నూల్ జిల్లాలో రజక దంపతులపై దాడి చేసి 2 నెలల పసి పాప మృతికి కారణమైన వారిపై హత్య నేరం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బెల్లంపల్లికి చెందిన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి వారిని అరెస్ట్ చేయకపోవడాన్ని MHD ఖండిస్తుందన్నారు.

February 23, 2026 / 09:12 AM IST

బీఆర్ఎస్ నేత రవీందర్ కన్నుమూత

MDK: వల్లూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ చిందం సబిత భర్త రవీందర్ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో రవీందర్ కీలకంగా వ్యవహరించారు. ఆయన మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

February 23, 2026 / 09:11 AM IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. టికెట్ల రూపంలో రూ.1,23,710, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.60,900, అన్నదానానికి రూ.28,412 వసూలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా దేవాలయానికి రూ.2,13,022 ఆదాయం లభించిందని వెల్లడించారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు.

February 23, 2026 / 09:10 AM IST

వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి: ఏఈఓ

MNCL: జన్నారం మండలంలోని రైతులు వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలని మండలంలోని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో రెండు రోజులుగా మబ్బు పట్టిన వాతావరణం ఉందన్నారు. రైతులు వేసిన పంటలు ఎదుగుదశలో ఉన్నాయని, మబ్బు పట్టడంతో చల్లటి వాతావరణం ఉంటుందన్నారు. ఈ సమయంలో పంటలకు వివిధ తెగులు సోకే ప్రమాదం ఉందని, వాతావరణ మార్పులను గమనించాలన్నారు.

February 23, 2026 / 09:10 AM IST

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి

ASF: ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన కెరమెరి మండలంలో చోటు చేసుకుంది. కెరమెరి ఎస్సై మధుకర్ కథనం ప్రకారం.. కెరిమెరికి చెందిన గుర్నాలే వార్లు(74) బస్టాండ్ సమీపంలోని కిరాణా షాపునకు వెళ్తున్న ఆయను, వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.

February 23, 2026 / 09:10 AM IST

సమాజంలో మహిళలు పాత్ర కీలకం: గోడం రేణుక

ADB: సమాజ అభివృద్ధిలో మహిళలు కీలకపాత్ర పోషించాలని ఆదివాసి తుడుందెబ్బ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు గోడం రేణుక అన్నారు. మావల మండల కేంద్రంలో సంఘం నాయకులతో ఆదావారం సమావేశమై ఆమె మాట్లాడారు. మార్చి 8న నిర్వహించే అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు గణేష్, దాదీ రావు, మనోజ్, ఇందిర, రమేష్ తదితరులున్నారు.

February 23, 2026 / 09:09 AM IST

జాతర ఘటన.. NHRCకి ఫిర్యాదు

NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా 2 నెలల పసికందు మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.

February 23, 2026 / 09:09 AM IST

ఈనెల 26 నుంచి ఎల్లమ్మ తల్లి జాతర ప్రారంభం

VKB: దోమ మండలం శివారెడ్డిపల్లిలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఎల్లమ్మ తల్లి జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. జాతర సందర్భంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కొమురక్క ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు గుడి నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాది జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

February 23, 2026 / 09:08 AM IST

నేటి నుంచి వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు

SRCL: చందుర్తి మండలంలో ఇటీవల గెలుపొందిన గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు సోమవారం నుండి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చందుర్తి ఎంపీడీవో రాధ తెలిపారు. మొదటి విడతగా ఈనెల 23 -27 వరకు ఐదు రోజులు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చందుర్తి రైతు వేదికలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

February 23, 2026 / 09:07 AM IST

అంగన్వాడీ కేంద్రాల బాధ్యత సర్పంచులదే

KNR: గ్రామస్థాయిలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక సర్పంచ్‌లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ 777, పెద్దపల్లి 706, జగిత్యాల 1065, సిరిసిల్ల 587 కేంద్రాల్లో పోషకాహార పంపిణీ, నాణ్యతను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 09:03 AM IST

నేటి నుంచి వారికి శిక్షణా తరగతులు

RR: షాద్‌నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ పాలన-పంచాయితీ రాజ్ చట్టంపై వార్డు సభ్యులకు అవగాహన కల్పించేందుకు నేటి నుంచి శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బన్సీలాల్ తెలిపారు. ఈరోజు నుంచి మార్చి 23 వరకు 4 విడతలుగా శిక్షణ కొనసాగనుందని, వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు.

February 23, 2026 / 08:59 AM IST

నేటి నుంచి ప్రారంభం కానున్న కొమ్మాల జాతర

WGL: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఇవాళ అధ్యయనోత్సవంతో మొదలై, ఫిబ్రవరి 27న కల్యాణోత్సవం, మార్చి 3న బండ్ల ఊరేగింపు, మార్చి 7న రథోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.

February 23, 2026 / 08:53 AM IST

అంగన్వాడీ సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

WNP: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు కనీస వేతనం కోసం సీఎంతో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడతానని, ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయడానికి కృషి చేస్తానని, అన్ని సమస్యలను పరిష్కరించేలా చూస్తానని అన్నారు.

February 23, 2026 / 08:52 AM IST

రెండు ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు: ఎస్సై

HNK: ఐనవోలు మండలం పన్నేలు గ్రామం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా సోమవారం ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్ ట్రాక్టర్‌ను ఆపి అనుమతిపత్రాలను పరిశీలించినప్పటికీ, సరైన అనుమతులు లేని కారణంగా ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించినట్లు, ట్రాక్టర్ డ్రైవర్,యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

February 23, 2026 / 08:47 AM IST