జనగామ మండలం ఎల్లంల గ్రామంలో నిర్వహించనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను కమిటీ సభ్యులు నేడు ఆహ్వానించారు. ఈ నెల 23న ఉదయం 9:30 గంటలకు గ్రామంలో విగ్రహావిష్కరణ మహోత్సవం జరగనుందని కమిటీ ప్రతినిధులు వివరించారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్ అభివృద్దికి కట్టుబడి ఉంటానని కార్పొరేటర్ చిందం సత్యవతి శ్రీనివాస్ అన్నారు. డివిజన్ పరిధిలోని గౌతమేశ్వర కాలనీలో అధ్యక్షుడు లక్కాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో సమగ్ర ప్రణాళికతో మున్సిపల్ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.
PDPL: జిల్లాలో విడాకుల కేసు విచారణకు వచ్చిన నూనె పద్మపై ఆమె భర్త వెంకటేశ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెయింటెనెన్స్ కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించి, ఆమె ఒప్పుకోకపోవడంతో జాఫర్ ఖాన్ పేట శివారుకు తీసుకెళ్లి తలపై రాయితో కొట్టి గాయపరిచాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న పద్మను కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
VKB: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఇకనుంచి యధావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి గత కొన్ని వారాలుగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున నిలిపివేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.
GDWL: శాంతినగర్-2 33 కేవీ ఫీడర్ కింద తాకే చెట్ల కొమ్మలను తొలగించడానికి, 33/11 కేవీ రాజోలి సబ్ స్టేషన్లో మెయింటెనెన్స్కి లైన్ క్లియర్ (LC) తీసుకుంటామని ఏఈ హరి శనివారం ప్రకటించారు. రాజోలి, తూర్పు, పడమటి గార్లపాడు, తుమ్మలపల్లి గ్రామాలకు ఆదివారం మధ్యహ్నం ఒంటి గంట నుంచి సాయత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
BHPL: మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడంతో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక పై అందరి దృష్టి సారించారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులకు అవకాశం దక్కనుంది. నిబంధనల ప్రకారం ఇద్దరు మైనారిటీలకు, ఒకరు మాజీ కౌన్సిలరుకు కేటాయించాలి. ఇందులో ఒక స్థానం మహిళకు రిజర్వ్ అవుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది.
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 1976లో స్థాపించారు. 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. ఉన్నత విద్యను అందిస్తూ NAAC నుంచి A+ గ్రేడ్ గుర్తింపు పొందింది. 27 విభాగాలు, అనేక అనుబంధ కళాశాలలతో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్ట్స్, సైన్స్లో సుమారు 95+ కోర్సులను అందిస్తోంది.UG, PG, Ph.Dతో పాటు దూరవిద్య కోర్సులు అందిస్తుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ CM రేవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యహ్నం 1:30 గం HYD నుంచి MHBD జిల్లాకు రానున్నారు. మ. 2:15 గంగారం మండలం రెడ్యాల గ్రామానికి వెళ్తారు. 3 గం ములుగు జిల్లాకు రానున్నారు. 3:30 దేవాదాల ప్రాజెక్టును పరిశీలించి అక్కడ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయత్రం 5 గంటలకు HYDకి తిరిగి వెళ్తారు.
ఆదిలాబాద్ పట్టణంలో వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కెఆర్కె కాలనీలో కౌన్సిలర్ రజిత రాము ఆధ్వర్యంలో నిరుపయోగంగా ఉన్న బోరింగులకు మరమ్మతులు చేయించారు. ఆమె మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.
KMR: జాతీయ స్థాయిలో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVR) 2025-26లో భాగంగా జిల్లా నుంచి TSNR ZPHS బాయ్స్ బీబీపేట్, MPPS మహమ్మదాపూర్ పాఠశాలలు రాష్ట్ర స్థాయిలో ఎంపికై జాతీయ స్థాయికి నామినేట్ అయినట్లు DEO రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు పాఠశాల హెచ్ఎంలను ఆయన అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాలలో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ ధర కిలో రూ.800 చొప్పున విక్రయిస్తుండగా, చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.250 నుంచి రూ.260 మధ్య విక్రయిస్తున్నారు. కోడి కిలో రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధర కాస్త తగ్గుముఖం పట్టింది. మటన్ ధరలలో ఎలాంటి మార్పు లేదు.
RR: మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన షాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు తాళ్లపల్లి గ్రామానికి చెందిన నందిని అనే వివాహిత నాగుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRCL: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గిందని విక్రయదారులు తెలిపారు.
RR: మహాశివరాత్రి జాతర సందర్భంగా సంత్ నిరంకార్ ఆధ్వర్యంలో చేవెళ్ల వెంకటేశ్వర పుష్కరిణి వద్ద శ్రమదానంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ సమతా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, జాతరకు వచ్చే భక్తులు పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలిలోనే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.