• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆహ్వాన పత్రిక అందజేసిన డిప్యూటీ సీఎం

KMM: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న HYDలో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆశీర్వచనాలు అందజేయాలని కోరారు.

February 20, 2026 / 04:33 PM IST

సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, గిరిజనుల ఆత్మగౌరవానికి ఆయన జీవితమే ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

February 20, 2026 / 04:31 PM IST

ధరూర్‌లో ఉపాధ్యాయుల సమీక్ష సమావేశం

GDWL: ధరూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల సముదాయ సమావేశం జరిగింది. ఎంఈవో రవీంద్రబాబు మాట్లాడుతూ… ప్రతి పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల కనీస సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని.. మధ్యాహ్న భోజన పథకం వివరాలను ప్రతిరోజూ ఎస్ఎంఎస్ ద్వారా పంపించాలని సూచించారు.

February 20, 2026 / 04:24 PM IST

మైనార్టీ గురుకులంలో మార్కుల పరిశీలన

NRPT: మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల నిర్మాణాత్మక మూల్యాంకన (FA) మార్కుల పరిశీలన కొనసాగింది. ఉపాధ్యాయులు నరసింహారావు, లక్ష్మారెడ్డి, సంధ్య బృందం విద్యార్థుల అంతర్గత మార్కులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులు పక్కాగా సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

February 20, 2026 / 04:20 PM IST

ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

WNP: బీఆర్ఎస్ హయాంలో కేవలం పార్టీ కార్యకర్తలకే ఇళ్ల పట్టాలు ఇచ్చారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కొత్తపల్లిలో లబ్ధిదారురాలు గొల్ల శంకరమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొని ఆయన నూతన వస్త్రాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కడితే కమిషన్లు రావనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వాటిని పెట్టిందని ఆరోపించారు.

February 20, 2026 / 04:20 PM IST

సావర్గవ్‌లో తాగునీటి సమస్యపై గ్రామసభ

KMR: జుక్కల్ మండలం సావర్గవ్‌ గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు శుక్రవారం సర్పంచ్ రవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బోరుబావుల మరమ్మతులు చేపట్టాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టి నీటి వృథాను అరికట్టాలని నిర్ణయించారు. తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా మోటార్లకు మరమ్మతులు చేయించాలని తీర్మానించారు. అలాగే దళితవాడలో మురుగుకాలువల నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్నారు.

February 20, 2026 / 04:20 PM IST

‘ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి’

MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకుబ్ ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. జీరాంజీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ. 600 పెంచాలని కోరారు.

February 20, 2026 / 04:11 PM IST

రెజ్లింగ్ క్రీడాకారుడిని అభినందించిన పీవో

BDK: ఐటీడీఏ పీవో రాహుల్‌ను, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాశీ హుస్సేన్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల యూపీలో జరిగిన ఫెడరేషన్ కప్ రెస్లింగ్ పోటీల్లో వెంకటప్రసాద్ 97 కేజీల విభాగంలో నవీన్ 100 కేజీల విభాగంలో సత్తా చాటారు. బెస్ట్ ర్యాంకుల్లో నిలిచి ఖేలో ఇండియా జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు.

February 20, 2026 / 04:11 PM IST

గుండ్లగుంటపల్లిలో పౌష్టికాహార పంపిణీ

NGKL: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఊర్కొండ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేష్ నాయక్ అన్నారు. గుండ్లగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. నాణ్యమైన ఆహారం ద్వారా మాతాశిశు మరణాలను అరికట్టడమే ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజని, ఉపసర్పంచ్ కొండల్ పాల్గొన్నారు.

February 20, 2026 / 04:10 PM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

HYD: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెక్రటేరియట్లో జరిగిన సమీక్షలోని నిర్ణయాలపై కంటోన్మెంట్ MLA శ్రీగణేశ్ అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

February 20, 2026 / 04:09 PM IST

ఇచ్చిన హామీ నెరవేర్చిన కౌన్సిలర్

KNR: మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే ఆడపిల్లల వివాహానికి రూ. 10,116 ఇస్తానని హుజరాబాద్ 21వ వార్డు కౌన్సిలర్ పంజాల రాజ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఎన్నికలో ఆయన గెలవడంతో ఇచ్చిన హామీ మేరకు వార్డుకి చెందిన పోగు తేజస్వినికి వివాహం నిశ్చయం కాగా ఇవాళ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలందరూ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్‌ను అభినందించారు .

February 20, 2026 / 04:08 PM IST

సేవాలాల్ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం, ఏన్కూర్ మండలం హిమామ్ నగర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 20, 2026 / 04:06 PM IST

ఈనెల 24న ఛలో సెక్రటేరియట్‌కు పిలుపు

NRML: ఆర్టీసీ సమస్యల పరిష్కారం, ప్రభుత్వంలో విలీనం తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.ఆర్.రెడ్డి శుక్రవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. వేతన సవరణ అమలు, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ వంటి ప్రధాన డిమాండ్లపై అన్ని డిపోల ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

February 20, 2026 / 04:05 PM IST

‘కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి’

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ విషయంలో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాకా పేరు ప్రతిష్టను అభాసుపాలు చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, మనవడు ఎంపీ వంశీకృష్ణ దౌర్జన్యాలు అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

February 20, 2026 / 04:04 PM IST

అభివృద్ధి దిశగా ఖానాపూర్ నియోజకవర్గం

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పలు ప్రారంభోత్సవాలు,  భూమి పూజలను నిర్మల్ డసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఉట్నూర్‌లోని కన్నాపూర్, గంగాపూర్, పాత ఉట్నూర్‌లలో రూ.10 లక్షలతో వివో బిల్డింగ్స్‌కు భూమి పూజ చేశామన్నారు. అలాగే రూ. 20 లక్షలతో జీపీ భవనాలు ప్రారంభం అయ్యాయన్నారు.

February 20, 2026 / 04:02 PM IST