• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

JGL: భీమారం మండలం గోవిందారం గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ మహిళా సమైక్య భవనానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మహిళా సాధికారతకు భవన నిర్మాణాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

February 23, 2026 / 04:43 PM IST

ఇటుకల బట్టిలో కార్మికుడు మృతి..

SRPT: చివ్వెంల మండలంలోని వల్లబాపురం గ్రామ శివారులో ఇటుకల బట్టిలో పనిచేసే కార్మికుడు పల్లపు రాజు ( 35 ) ఇవాళ ఇటుకల బట్టిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతిని స్వగ్రామం సూర్యాపేట చెందినవాడిగా విశ్వసనీయ సమాచారం. సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

February 23, 2026 / 04:40 PM IST

‘కొమురంభీం గొప్ప పోరాటయోధుడు’

ASF: కొమురంభీం గొప్ప పోరాటయోధుడని, ఆయన ఆదివాసీల కోసం చేసిన పోరాటం, త్యాగం మరువలేనిదని ప్రముఖ కవి జయరాజ్ అన్నారు. ఈ క్రమంలో ప్రకృతి విజ్ఞాన యాత్రలో భాగంగా సోమవారం జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీ ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళుర్పించారు.

February 23, 2026 / 04:40 PM IST

హరితహారం మొక్కల నరికివేతపై ఫిర్యాదు

NGKL: తెలకపల్లి మండలం ఆలేరులో హరితహారం మొక్కలను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అదనపు కలెక్టర్ దేవసహాయంకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఆనంద్, కార్యదర్శి మహేశ్ సహకారంతో గట్టు బాలిశ్వరయ్య అనే వ్యక్తి మొక్కలను నరికినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 04:39 PM IST

‘అంబేద్కర్ కళాభవనం నిర్మించాలి’

వనపర్తి జిల్లాలో అంబేద్కర్ కళా భవనం నిర్మించాలని కోరుతూ సోమవారం జిల్లా ప్రజావాణిలో సామాజిక వేత గంధం నాగరాజు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దళితులకు అంబేద్కర్ పేరు మీద భవనం చేపట్టి దళితులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. మారమ్మ కుంట దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలంలో నిర్మించాలని కోరారు.

February 23, 2026 / 04:38 PM IST

వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంపై శిక్షణ ప్రారంభం

KNR: శంకరపట్నం మండలం తాడికల్ రైతు వేదికలో కొత్తగట్టు, గొల్లపల్లి, లింగాపూర్, మెట్పల్లి, కేశవపట్నం, వంకాయగూడెం, తాడికల్, ఇప్పలపల్లి, అంబాలాపూర్, కరీంపేట, చింతగుట్ట, ఏరడపల్లి గ్రామాల నూతన వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం 2018 పై శిక్షణ ప్రారంభమైంది. ఎంపీవో ప్రభాకర్ అధ్యక్షతన ఈనెల 27 వరకు కొనసాగనుంది. పంచాయతీ కార్యదర్శులు, 9 గ్రామాల ఉపసర్పంచులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:37 PM IST

‘పశువుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి’

KMM: మున్సిపల్ ఛైర్మన్ పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా మండలంలోని పడమటిలో కారంలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాడి రైతులు పశువుల ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ ఛైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. పశు వైద్యులు మూగజీవాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.

February 23, 2026 / 04:36 PM IST

ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వరపరిష్కారం: కలెక్టర్

VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపి ఫిర్యాదుదారులకు న్యాయం చేయడం జరుగుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా అధికారులు ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కారం చూపి న్యాయం చేయాలన్నారు.

February 23, 2026 / 04:33 PM IST

మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన

MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో మహిళా సంఘ భవనానికి సర్పంచ్ ఎంజాల స్వామి శంకుస్థాపన పూజ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మహిళా సంఘ భవనానికి రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఏఈ మధుసూదన్‌లతో కలిసి భూమిపూజ నిర్వహించారు. వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

February 23, 2026 / 04:33 PM IST

‘ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం’

SRCL: ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

February 23, 2026 / 04:32 PM IST

‘కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలి’

VKB: కుల్కచర్ల ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని మండల ఇంఛార్జ్ MEO రామ్ చందర్ అన్నారు. మండలంలోని ముజాహిద్పూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహించారు. విద్యార్థులకు సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా బోధన చేయాలన్నారు. FLSను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.

February 23, 2026 / 04:31 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌కు మంత్రి సీతక్క శుభాకాంక్షలు

KMR: కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి సోమవారం పదవీ బాధ్యత స్వీకరించారు. ఈ తరుణంలో కామారెడ్డి ఇంఛార్జ్ మంత్రి సీతక్క ఫోన్‌లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. “రావాల్సింది ఉండే కానీ రాలేకపోయాను. మంత్రితో మీటింగ్ ఉండడం వలన రాలేకపోయాను” అని ఫోన్‌లో తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి ఛైర్ పర్సన్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

February 23, 2026 / 04:31 PM IST

పెద్దాయపల్లి భూమి ఆక్రమంపై ఫిర్యాదు

MBNR: బాలానగర్ (M) పెద్దాయపల్లి సర్వే నం.78లో ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్ ఆక్రమించిందని సామాజిక కార్యకర్త కోస్గి వెంకటయ్య సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. 2025 అక్టోబర్ 7న ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

February 23, 2026 / 04:30 PM IST

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యం

MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు. వివిధ అభివృద్ధి పనులు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

February 23, 2026 / 04:29 PM IST

ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

BHPL: జిల్లా ఐడీవోసీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం 44 దరఖాస్తులు స్వీకరించారు. భూమి, పెన్షన్లు, ఇతర సమస్యలపై వచ్చిన అర్జీలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్‌మెంట్ చేసి ఆదేశించారు.

February 23, 2026 / 04:27 PM IST