• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విద్యార్థులకు అవగాహన

SRCL: బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను శనివారం షీ టీమ్ బృందం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా బాలికలు, మహిళలు వేధింపులకు గురైతే నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 8712656425కు ఫిర్యాదు చేయాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని సూచించారు.

February 21, 2026 / 07:03 PM IST

సీపీఎం ఆధ్వర్యంలో RED BOOKS డే

WNP: వనపర్తి పట్టణంలో శనివారం సీపీఎం ఆధ్వర్యంలో రెడ్ బుక్స్ డే ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయంలో జిల్లా నాయకుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్మికుల హక్కులు మొదలగు వాటి గురించి రెడ్ బుక్స్ ద్వారా తెలిసిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 07:02 PM IST

‘మనిషి వికాసం మాతృభాషతో జరుగుతుంది’

MBNR: జడ్చర్లలోని డా.బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్లం, హిందీ, తెలుగు, సంస్కృతం, ఉర్దూ విభాగాలన్ని కలిసి ఘనంగా మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీ. సుకన్య పాల్గొని మాట్లాడారు. మనిషి వికాసం మాతృభాషతో జరుగుతుందన్నారు. భాష అమ్మలాంటిదని, అమ్మను ప్రేమించినట్లు భాషను ప్రేమించి, గౌరవించాలన్నారు.

February 21, 2026 / 07:02 PM IST

రాష్ట్ర స్థాయిలో తులసీదాస్ సత్తా

NGKL: ఊర్కొండ మండలం బొమ్మరాశిపల్లి గ్రామానికి చెందిన గోవిందు విజయ్ యాదవ్ కుమారుడు గోవిందు తులసీధర్ రాష్ట్రస్థాయి దివ్యంగా క్రీడల్లో చక్కని ప్రతిభ కనబరిచి తన సత్తాను చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్, జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు అతడికి అభినందనలు తెలిపారు.

February 21, 2026 / 07:02 PM IST

జోగులాంబ ఆలయంలో ప్రముఖ డైరెక్టర్

GDWL: అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంను ‘బలగం’ చిత్ర దర్శకుడు, సినీ నటుడు వేణు యెల్దండి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారిని, స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది సురేశ్ పాల్గొన్నారు.

February 21, 2026 / 07:02 PM IST

‘సామాజిక న్యాయం కోసమే చట్టాలు’

KNR: ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాలకు అనుగుణంగా పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తనకు మహేష్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. లింగ, ధనిక, పేద, మత ఏ ఇతర వాటితో సంబంధం లేకుండా అందరికీ సామాజిక న్యాయం అందించేలా చట్టాలు రూపొందించబడ్డాయని అన్నారు.

February 21, 2026 / 07:01 PM IST

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

MHBD: దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామ సర్పంచ్ అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్ కార్యక్రమానికి అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల సౌకర్యార్థం శిబిరాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయ విషయమన్నారు. తొర్రూరు ఏఎంసీ ఛైర్మన్ బట్టునాయక్ తదితరులున్నారు.

February 21, 2026 / 06:55 PM IST

ఖాదీ అంటే కలెక్షన్లు కాదు సర్వీస్: ఎమ్మెల్యే

KMR: ఖాదీ అంటే కలెక్షన్లు కాదని, సర్వీస్ అనే దిశగా తాను పని చేస్తున్నట్లు MLA కె.వి రమణారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాను లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చానని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చెప్పుకుంటూ ఇంచార్జీ మంత్రిని తీసుకువచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

February 21, 2026 / 06:52 PM IST

23 నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ

MNCL: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈనెల 23 నుంచి నస్పూర్‌లోని మంచిర్యాల కలెక్టరేట్‌లో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని వెల్లడించారు.

February 21, 2026 / 06:51 PM IST

సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

KMM: వైరా నియోజకవర్గం పాత తండాలోని రైతు వేదికలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన జాతి అభ్యున్నతికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

February 21, 2026 / 06:48 PM IST

సంఘం బస్తీలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇంట్లో ప్రమాదం

ASF: కాగజ్ నగర్ సంఘం బస్తీలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇంట్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అక్కడ ఉన్న పలువురికి గాయాలవ్వగా, స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద తీవ్రతకు ఇంటి సామాగ్రి ధ్వంసమైంది. పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

February 21, 2026 / 06:48 PM IST

హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితురాలు అరెస్ట్

RR: చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పుష్కరని వద్ద జరిగిన కరుణాకర్ హత్య కేసును పోలీసులు చేదించారు. పోలీసుల వివరాలు.. గత ఆరేళ్లుగా కలిసి ఉంటున్న కరుణాకర్, బాలమని శివరాత్రి జాతర సందర్భంగా పుష్కరిని వద్ద మద్యం సేవించారు. డబ్బులు విషయంలో వాగ్వాదం జరగడంతో కరుణాకర్ పై కట్టెతో బాలమణి దాడి చేసి పుష్కరిణిలో తోసేయగా మృతి చెందాడు. నిందితురాలు బాలమణిని పోలీసులు అరెస్టు చేశారు.

February 21, 2026 / 06:48 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు: మంచిరెడ్డి

HYD: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. కోర్టు స్టే పేరుతో ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని ఆరోపించారు. 

February 21, 2026 / 06:45 PM IST

అగ్రి షోలు రైతులకు మార్గదర్శకం: సునీల్ కుమార్

BHPL: ఆధునిక వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించేందుకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం BHPL, కాటారం డివిజన్‌లకు చెందిన 50 మంది రైతులను HYDలో జరుగుతున్న “రైతుబడి అగ్రి షో”కు తీసుకెళ్లారు. ఆధునిక సాంకేతికత అవలంబిస్తే తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు సాధ్యమని, ఇలాంటి అగ్రి షోలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

February 21, 2026 / 06:43 PM IST

‘ఇంటర్ పరీక్షలకు పూర్తయిన ఏర్పాట్లు’

NRML: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు డీఐఈవో పరుశురాం శనివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 23 కళాశాలలో ఉండగా పరీక్షలకు 13125 మంది విద్యార్థులు హాజరవుతున్నారని మొదటి సంవత్సరం 6652, ద్వితీయ సంవత్సరం 6473 మంది విద్యార్థులు హాజరవుతుండగా వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

February 21, 2026 / 06:42 PM IST