• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: సుమన్ కుమార్

SDPT: ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని ఏసీపీ సుమన్ కుమార్ కోరారు. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ఈనెల 28 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, ట్రాఫిక్ నిబంధనల అమలు కఠినతరం చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:41 PM IST

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

February 21, 2026 / 03:38 PM IST

‘తల్లిదండ్రులు విద్యార్థులపై శ్రద్ధ చూపాలి’

NRPT: పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో పిల్లలు చదువుకునేలా ఇంటి దగ్గర తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని మీర్జాపూర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం జనార్దన్ రెడ్డి సూచించారు. శనివారం మిర్జాపూర్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. 100% ఉత్తీర్ణతకోసం ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తున్నారని అందుకు తగ్గట్లు విద్యార్థుల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు.

February 21, 2026 / 03:36 PM IST

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి

BDK: చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామంలో శనివారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి భోగ్ బండారో నిర్వహించారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని ఎడ్ల బండిపై ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు బాబు నాయక్ పాల్గొని భోగ్ బండరో నిర్వహించారు. మహారాజ్ చూపించిన అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.

February 21, 2026 / 03:36 PM IST

మాతృభాష తీపిని ఆస్వాదించాలి: MLA నాయిని

HNK: మాతృభాష తీపిని ఆస్వాదించాలని, తెలుగు ఇతిహాసాలను చదవాలని, అమ్మ భాషను మరువవద్దని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలలో నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా కన్నతల్లి లాంటి మాతృభాషను విస్మరించకూడదని అన్నారు.

February 21, 2026 / 03:35 PM IST

ఇచ్చోడా డిగ్రీ కళాశాలలో ఘనంగా మాతృభాష దినోత్సవం

ADB: ఇచ్చోడా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ సరస్వతి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి రోజువారీ జీవితంలో మాతృభాషను నిత్యం వినియోగిస్తూ, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, మాతృభాష పరిరక్షణ ద్వారానే మన సంస్కృతి, మన ఉనికి నిలబడుతుందన్నారు.

February 21, 2026 / 03:34 PM IST

వోల్టేజ్ సమస్య రాకుండా చర్యలు

VKB: కుల్కచర్లలో MPDO కార్యాలయం పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ అధిక లోడ్ పడడంతో‌లో వోల్టేజ్ సమస్యతో వినియోగదారులు బాధపడుతున్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని అధిక సామర్థ్యం గల ఏర్పాటు చేసి కరెంటు సమస్యలను పరిష్కరిస్తామని AE నాగరాజు తెలిపారు. మండల కేంద్రంతో పాటు గ్రామాలలో కరెంటు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

February 21, 2026 / 03:33 PM IST

‘అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఎండుతున్న పొలాలు’

MHBD: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు గంజి ఉప్పల్ రెడ్డి తన మూడెకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. వేసవికాలం రాకముందే భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బావుల్లో నీరు లేక రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో చేసేదేమిలేక గంటకు రూ.5వేలు వెచ్చించి, 10 గంటలకు రూ.50 వేలు ఖర్చు చేసి పొక్లైనర్ సహాయంతో పూడిక తీసినట్లు తెలిపారు.

February 21, 2026 / 03:32 PM IST

గొర్రెల, మేకల పెంపకదారుల సంఘ డైరీ ఆవిష్కరణ

KNR: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా గొర్రెల మేకల పెంపక దార్ల సంఘం డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కాలువ సురేష్ యాదవ్, శంకరపట్నం మండల అధ్యక్షులు కేశవేణి రవీందర్ యాదవ్, గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 03:32 PM IST

భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: హన్మకొండలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. మున్నూరుకాపు భవనం గ్రౌండ్ లెవల్ పనులు పూర్తైన క్రమంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

February 21, 2026 / 03:31 PM IST

ICS మల్టీకల్చరల్ ఈవెంట్‌కు ఆహ్వానం

MBNR: బ్రిస్బేన్‌లో నిర్వహించనున్న ‘ICS మల్టీకల్చరల్ ఈవెంట్ 2026’కు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానం అందింది. నివాసంలో ICS క్వీన్స్‌లాండ్ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలుగు సంస్కృతిని విదేశాల్లో చాటిచెప్పేలా కార్యక్రమం రూపొందించినట్టు పేర్కొన్నారు.

February 21, 2026 / 03:30 PM IST

సేవాదళ్ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని వినతి

జగిత్యాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని కోరుతూ సేవాదళ్ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందయ్యను కలిశారు.ఈ సందర్భంగా సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయాల్లో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సేవా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రం అందజశారు.

February 21, 2026 / 03:27 PM IST

గాంధీ భవన్ ముట్టడికి BJYM నేతల అరెస్ట్

NGKL: కల్వకుర్తిలో BJYM నాయకులను శనివారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని గాంధీ భవన్ ముట్టడికి BJYM రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అరెస్టు అయినవారిలో ధన్నోజు నరేష్ చారి, కుంభం చందు ముదిరాజ్, రాజశేఖర్, వంశీ, శివ ఉన్నారు. కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. BJYM శ్రేణులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 21, 2026 / 03:20 PM IST

ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కాయకల్ప టీమ్

నిర్మల్ జిల్లా, ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిని కాయకల్ప టీం వైద్యాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గల వసతులు, పరిశుభ్రతను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ హర్షవర్ధన్, సిబ్బంది ఉన్నారు.

February 21, 2026 / 03:19 PM IST

‘ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలి’

GDWL: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హరీష్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి హృదయ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. పరీక్ష గదుల్లో విద్యుత్, ఫ్యాన్లు, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

February 21, 2026 / 03:18 PM IST