• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆనందబాబు ఆకస్మిక తనిఖీ

BPT: వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శనివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు.

February 22, 2026 / 06:35 AM IST

విజయనగరంలో నేటి చికెన్ ధరలు

విజయనగరంలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.స్థానిక మార్కెట్‌లో చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యాపారుల సమాచారం ప్రకారం కేజీ బ్రాయిలర్ చికెన్ సుమారు ₹285కు, స్కిన్‌లెస్ ₹275కు, బోనెలెస్ ₹295 వరకు విక్రయించబడుతోంది. నాటు కోడి ధరలు మాత్రం ₹300 పైగా ఉన్నాయి. షాపుల ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:35 AM IST

పెండింగ్ క్లెయిములను పరిష్కరించాలని వినతి

W.G: భీమవరంలో భవన, ఇతర నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో అమలవుతున్న పథకాలపై అవగాహన కార్యక్రమం ఎఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పెండింగులో ఉన్న 46 వేల క్లెయిములను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన కార్మికశాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్‌కు యూనియన్ తరఫున వినతిపత్రం అందజేశారు.

February 22, 2026 / 06:34 AM IST

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

SRCL: జిల్లాలోని 1-10 తరగతి దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనంతరం దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్‌లో సమర్పించాలన్నారు.

February 22, 2026 / 06:33 AM IST

జిల్లాలో 64 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు: RIO

ATP: జిల్లాలో ఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఆర్ఐవో వెంకట రమణనాయక్ తెలిపారు. మొత్తం 64 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఉదయం 8.15 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 24,568 మంది, ద్వితీయ సంవత్సరంలో 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

February 22, 2026 / 06:32 AM IST

బైక్‌ను ఢీ కొన్న ట్రాక్టర్.. ఇద్దరకి తీవ్ర గాయాలు

MNCL: మందమర్రి పట్టణం పులిమడుగు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ర లోడుతో రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందన్నారు.

February 22, 2026 / 06:32 AM IST

‘బిల్లును సకాలంలో చెల్లించి సహకరించాలి’

WGL: రాయపర్తి మండలం మైలారం సబ్‌స్టేషన్ పరిధిలోని వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి సహకరించాలని సబ్ ఇంజనీర్ సయ్యద్ ముజాఫర్ అహ్మద్ కోరారు. ఆదివారం మైలారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక బిల్లుల సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

February 22, 2026 / 06:30 AM IST

మాస్టర్ మైండ్ 5వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ మేయర్

RR: మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధిలో గల బడంగ్‌పేట్ డివిజన్‌లో ది మాస్టర్ మైండ్ స్కూల్ 5వ వార్షికోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. మాజీ మేయర్ మాట్లాడుతూ.. ఈ విద్యాసంస్థలు అంచలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు.

February 22, 2026 / 06:30 AM IST

ఆరు కిలోల గంజాయి పట్టివేత

SKLM: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ రోడ్డులో శనివారం సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ద్విచక్రవాహనం పై 6 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న గంజాయిని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గంజాయి రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు ఉంటాయని సీఐ అన్నారు

February 22, 2026 / 06:30 AM IST

ఉత్తమ ఫలితాలు సాధించాలి.. ఏటీడబ్ల్యూవో

 ASR: జీ.మాడుగుల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శనివారం ఫేర్ వెల్ పార్టీ నిర్వహించారు. ఇందులో బాగంగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జీ.మాడుగుల ఏటీడబ్ల్యూవో నాగ శిరీష విద్యార్థులకు సూచించారు. సమయం వృథా చేయకుండా అన్ని సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

February 22, 2026 / 06:30 AM IST

విధులకు రాకుండానే సంతకాలు..!

SRPT: నూతనకల్ మండలం పెద్దనేమిల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం-2లోని సదరు టీచర్ 19న సెలవులో ఉండి కూడా హాజరు పట్టీలో సంతకం చేశారని, 21న ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారని గ్రామస్థులు ఆరోపించారు. పిల్లల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, బాధ్యత రహితంగా వ్యవహారిస్తున్న టీచర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

February 22, 2026 / 06:29 AM IST

డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా

SRCL: జిల్లాలో ఈరోజు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. గంభీరావుపేట మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన హాజరుకావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ప్రోగ్రాం రద్దయినట్లు డిప్యూటీ సీఎం ప్రైవేట్ సెక్రటరీ ప్రకటించారు. పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

February 22, 2026 / 06:28 AM IST

తొర్రివేముల వాసికి వైసీపీలో పదవి

KDP: వైసీపీ రాష్ట్ర అనుబంధ వింగ్ కమిటీ సభ్యులను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఇందులో భాగంగా కడప జిల్లా బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబరుగా మైలవరం మండలం తొర్రి వేముల సుబ్బయ్యను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన YS జగన్‌కు జిల్లా వైసీపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

February 22, 2026 / 06:28 AM IST

నేడు ఉచిత వైద్య శిబిరం

CTR: శాంతిపురం మండల పరిధి పెద్దూరు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో పీఈఎస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పీఆర్‌వోలు వెంకటేష్, చంద్ర తెలిపారు. ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేపట్టి అవసరమైన వారికి మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 06:27 AM IST

గుంటూరులో చంద్రబాబు పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం నిర్వహించనున్న ‘గ్రామీణ డాక్ సేవక్’ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన తపాలశాఖ ఉద్యోగులను సీఎం సన్మానించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి సింధియా కూడా హాజరుకానున్నారు.

February 22, 2026 / 06:25 AM IST