• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉమామహేశ్వర దేవాలయం మూసివేత

NGKL: మార్చి 3వ తేదీన మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మండల పరిధిలోని శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన ఉమామహేశ్వర దేవాలయం మూసివేయడం జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ మాధవరెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీనివాస రావులు శనివారం వెల్లడించారు. భక్తులు యాత్రికులు ఈ విషయాన్ని గమనించాలని సహకరించాలని కోరారు. 4వ తేదీ నుంచి యథావిధిగా ఆలయంలో దర్శనం ఉంటుందన్నారు.

February 28, 2026 / 04:17 PM IST

ఆకివీడులో ఫోక్సో కేసు నమోదు

W.G: ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. సమతా నగర్ ప్రాంతానికి చెందిన పాల మరియమ్మ కుమార్తె(మైనర్ బాలిక)ను అదే ప్రాంతానికి చెందిన బోనాల రాము పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగా కలిసినట్లు ఎస్సై తెలిపారు. పెళ్లికి నిరాకరించడంతో తల్లిపాల మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో రాముపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

February 28, 2026 / 04:17 PM IST

పోలీస్ శాఖకి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం

చిత్తూరు ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు పూతలపట్టు పోలీస్ స్టేషన్ నుంచి పదవీ విరమణ పొందిన ASI శేఖర్‌ను పోలీసులు సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ S.R. రాజశేఖర రాజు, AR అదనపు ఎస్పీ దేవదాస్, ఆయన 39 సంవత్సరాల అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సేవను ప్రశంసించారు. ఆయన నిబద్ధత, త్యాగాన్ని ప్రశంసించి ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 04:16 PM IST

వంగూరు వాసికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్

NGKL: వంగూరు మండలం డిండిచింతపల్లికి చెందిన సుగురిబాబు కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ విద్యుత్ ఆధారిత వ్యవస్థలపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ మల్లేశం ఆధ్వర్యంలో పీహెచ్డీ పరిశోధనలు పూర్తి చేశానని అన్నారు. అనంతరం ఈరోజు డాక్టరేట్ స్వీకరించారు.

February 28, 2026 / 04:16 PM IST

పేలుడు ఘటనపై మంత్రి నారాయణ విచారం

AP: కాకినాడలో బాణాసంచా పేలుడు ఘటనపై మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వైద్యులను పంపించి తక్షణ వైద్యసాయం అందించాలని ఆదేశించారు.

February 28, 2026 / 04:15 PM IST

ఈడెన్‌ గార్డెన్స్‌లో పరుగుల వరద..?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన నాకౌట్ మ్యాచ్ జరగనుంది. గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుండగా, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్ జరిగే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని సమాచారం. రెండు జట్లలోనూ విధ్వంసకర పవర్ హిట్టర్లు ఉండటంతో భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.

February 28, 2026 / 04:15 PM IST

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారు: ఎస్పీ

మహబూబ్‌నగర్: జిల్లాలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ వెంకయ్యకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. జానకి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. 34 ఏళ్ల సేవలో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని ఎస్పీ కొనియాడారు.

February 28, 2026 / 04:14 PM IST

కాజీపేట ప్రాంతానికి చేసింది శూన్యం: MLA

HNK: BRS హయాంలో కాజీపేట ప్రాంతానికి చేసింది శూన్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీనియర్ శాసన సభ్యునిగా ఉన్న హరీశ్ రావు కూడా దుష్ప్రచారాలు చేయడం సబబు కాదని, కాజీపేటకు 30 పడకల దవాఖానా ఆవశ్యకత ఉన్నప్పటికీ కనీసం ప్రయత్నాలు చేయని దద్దమ్మలు మీరు అని, BRS నేతల మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.

February 28, 2026 / 04:14 PM IST

కంభంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక అర్బన్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 04:13 PM IST

అర్హులందరికీ పింఛన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

E.G: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కోలమూరులో కొత్తగా మంజూరైన నూతన పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు.

February 28, 2026 / 04:13 PM IST

‘కర్నూలులో CMRF చెక్కులు పంపిణి’

KRNL: CMRF పేద రోగులకు ఆర్థిక భరోసా ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో ఎంపీ బైరెడ్డి శబరి కార్యాలయంలో శనివారం CMRF చెక్కులను బాధితులకు అందజేశారు. వివిధ మండలాలకు చెందిన ఐదుగురికి మొత్తం రూ.3 లక్షలకుపైగా సహాయం అందింది. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు ఎంపీ శబరికి కృతజ్ఞతలు తెలిపారు.

February 28, 2026 / 04:11 PM IST

కాకినాడ పేలుడు ఘటనపై లోకేష్ దిగ్భ్రాంతి

AP: కాకినాడ పేలుడు ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పలువురు మృత్యువాత పడటం మాటలకు అందని విషాదం. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను, మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం’ అని వెల్లడించారు.

February 28, 2026 / 04:10 PM IST

ఘనంగా సైన్స్ దినోత్సవం

JGL: పెగడపల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్‌లో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ ఆధారంగా పలు పరికరాలను తయారు చేసి ప్రదర్శించారు. అలాగే పలు చిత్రపటాలను గీసి, వాటి ఉపయోగంపై విద్యార్థులు వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఎంఈవో సులోచన పాల్గొని విద్యార్థులు ప్రవేశించిన పరికరాలను పరిశీలించారు.

February 28, 2026 / 04:07 PM IST

మగాళ్ల రాజ్యంలో హీరోయిన్ల పరిస్థితి ఇదే: నటి

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంపికపై హీరోల ఆధిపత్యం గురించి నటి తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్ల తలరాతలు హీరోల చేతుల్లోనే ఉంటాయని, స్టార్ డైరెక్టర్లు అయితే తప్ప మిగతా సమయాల్లో హీరోల మాటే చెల్లుతుందని పేర్కొంది. మగాళ్ల రాజ్యంలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉందని, హీరోలకు నచ్చకపోతే అవకాశం వచ్చినా తొలగిస్తారని కుండబద్ధలు కొట్టింది.

February 28, 2026 / 04:07 PM IST

సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు

MNCL: మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పలు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఏరియా సింగరేణి పర్సనల్ HOD రాజేశ్వర్ రావు శనివారం తెలిపారు. మార్చ్ 5న మాదారం, 6న గోలేటిలో సాయంత్రం 4 గంటల నుండి పోటీలు జరుగుతాయన్నారు. వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న మహిళలు GM ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు.

February 28, 2026 / 04:06 PM IST