• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం..!

MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లికి చెందిన చెంది బాలా గౌడ్ కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ రాజానర్సింహా, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు మంగళవారం ఆయనను పరామర్శించారు. బాధితుడికి వైద్య ఖర్చుల నిమిత్తం నగదు రూపంలో ఆర్థిక సాయం అందజేశారు.

February 25, 2026 / 06:05 AM IST

​వృద్ధ దంపతులపై హత్యాయత్నం.. ముగ్గురు అరెస్ట్

అన్నమయ్య: కొత్తకోట మండలం రంగనాథపురంలో వృద్ధ దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీధిలో గొర్రెలను తోలుకురావడంపై తలెత్తిన వివాదంలో కృష్ణప్ప, కృష్ణమ్మలపై అదే గ్రామానికి చెందిన ఆరుగురు కర్రలతో దాడి చేశారు. బాధితుల కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కాండ్లమడుగు క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.

February 25, 2026 / 06:05 AM IST

రోడ్డు విస్తరణకు రూ.33 కోట్లు మంజూరు

KMM: ముదిగొండ మండలంలో రహదారుల అభివృద్ధికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ నిధులు మంజూరు చేశారు. తల్లంపాడు – ముదిగొండ రోడ్డు విస్తరణకు రూ.33 కోట్లు కేటాయించడంతో ఏళ్లనాటి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థుల విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.

February 25, 2026 / 06:04 AM IST

‘కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి’

SKLM: జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల సమస్యలు, పరిష్కారాల పై మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం రాత్రి తన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ ఎస్ ఈ కేవీవీ సుబ్రహ్మణ్యం‌తో సమీక్ష నిర్వహించారు. కొండ పేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను రూ.4 కోట్ల అంచనాతో పూర్తి చేసి, 2,500 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 25, 2026 / 06:04 AM IST

మూడు కార్పొరేషన్ల వెబ్ సైట్లు ఇవే..!

HYD: 300 డివిజన్లతో కూడిన GHMC మూడుముక్కలు కాగా.. GHMC, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లకు సంబంధించిన వెబ్ సైట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. GHMC వెబ్ సైట్ www.ghmc.gov.in, సైబరాబాద్ కార్పొరేషన్ cmc.telangana.gov.in, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ mmc.telangana.gov.in వెబ్ సైట్లలో ప్రజలు సేవలు పొందే అవకాశం ఉందని తెలియజేశారు.

February 25, 2026 / 06:03 AM IST

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే రోహిత్

MDK: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో హవేలిఘనపూర్ మండల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందజేశారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:03 AM IST

కొత్త పాలక వర్గానికి సమస్యల స్వాగతం!

VKB: కొడంగల్లో బుగ్గప్ప హోటల్ వద్ద రోడ్డు అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. అదే విధంగా తాండూర్ రోడ్డులో బాలాజీ సూపర్ మార్కెట్ పక్కన మురుగు కాలువ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు రహదారుల వద్ద మురుగు కాలువలు ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

February 25, 2026 / 06:02 AM IST

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం మూసివేత

CTR: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంను ఉదయం 6:20 గంటలకు మూసివేస్తున్నట్లు ఈవో వెంకట కిషోర్ తెలిపారు. సాయంత్రం 6:47కు గ్రహణం ఉండటంతో 9 గంటల ముందుగానే ఆలయం మూసివేస్తున్నారు. 4వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు, సేవలు యథావిధిగా జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.

February 25, 2026 / 06:01 AM IST

కాణిపాకం వినాయక స్వామి దేవస్థానం మూసివేత

CTR: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంను ఉదయం 6:20 గంటలకు మూసివేస్తున్నట్లు ఈవో వెంకట కిషోర్ తెలిపారు. సాయంత్రం 6:47కు గ్రహణం ఉండటంతో 9 గంటల ముందుగానే ఆలయం మూసివేస్తున్నారు. 4వ తేదీ ఉదయం నుంచి దర్శనాలు, సేవలు యథావిధిగా జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.

February 25, 2026 / 06:01 AM IST

హత్యాయత్నం కేసులో కార్పొరేటర్ అరెస్టు

WGL: ఆర్థిక లావాదేవీల వివాదంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ 5వ డివిజన్ వరంగల్ కార్పొరేటర్ శ్రీమన్నారాయణను మంగళవారం సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దిల్సుఖ్‌నగర్‌కు చెందిన చీదర శ్రీనివాస్ వద్ద రూ.35 లక్షల అప్పు, చెక్కుల వివాదంలో దాడిచేసిన కేసులో కార్పొరేటర్ పాత్ర బయట పడడంతో పోలీసులు అరెస్టు చేశారు.

February 25, 2026 / 06:01 AM IST

నేడు పాలకొల్లులో జాబ్ మేళా

W.G: పాలకొల్లులోని ఛాంబర్స్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చెన్నైకు చెందిన జియల్ కంపెనీ బుధవారం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.డీ.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ కంపెనీలో పనిచేయడానికి అర్హులని, అర్హత కలిగిన వారు కళాశాలలో జరిగే జాబ్ మేళాకు విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావచ్చన్నారు.

February 25, 2026 / 06:01 AM IST

‘వెంకటేశ్‌కు లిమ్కా బుక్’లో రికార్డు’

ASR: సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ అరుదైన ఘనత సాధించారు. 2026 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకు చోటు లభించింది. 4బీ పెన్సిల్ ముల్లుపై కేవలం 4 మి.మీ వెడల్పు, పొడవుతో అతి సూక్ష్మ తాజ్‌మహల్‌ను 6 గంటల శ్రమతో రూపొందించారు. నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్‌కు రికార్డు పత్రాన్ని మంగళవారం పోస్టల్ ద్వారా పంపారు.

February 25, 2026 / 06:01 AM IST

‘ఈనెల 28లోగా పెన్షన్ దారులు పత్రాలు సమర్పించాలి’

AKP: రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారులు ఈనెల 28వ తేదీలోగా జీవన ప్రమాణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా ఖజానా అధికారిణి సుభాషిణి మంగళవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.పెన్షన్ దారులు జీవన ప్రమాణ యాప్ లేదా సమీప పోస్ట్ ఆఫీస్ లో బ్యాంకులో సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో వీటిని సమర్పించాలన్నారు.

February 25, 2026 / 06:01 AM IST

‘అడవుల చుట్టూ ఎకో-సెన్సిటివ్ జోన్ తప్పనిసరి’

KDP: ప్రతి రక్షిత అడవి, వన్యప్రాణి కేంద్రం చుట్టూ 1KM మేర ఎకో-సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం ప్రొద్దుటూరు, బద్వేలు అటవీ ప్రాంతాల మాస్టర్ ప్లాన్‌పై DFO వినీత్ కుమార్‌తో కలిసి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. అటవీ సంపదను, వన్యప్రాణులను రక్షించేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

February 25, 2026 / 06:00 AM IST

జిల్లాలో పెరగనున్న ఎండలు

ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గాలిలో తేమ మధ్యాహ్నం సమయానికి 35 శాతానికి పడిపోతుందని, ఆగ్నేయ దిశ నుంచి గంటకు 5కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:00 AM IST