AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో తేదీ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నరసింహారెడ్డి చిత్రపటానికి రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు తెలియని స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా దరణి మధుకర్, డిప్యూటీ మేయర్గా సల్ల రమ్య మహేష్ ఆదివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. MLA సహకారంతో కార్పొరేషన్ను అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
TG: వనపర్తి జిల్లాలో పోలీసులు నకిలీ స్వామిని అరెస్ట్ చేశారు. పెబ్బేరుకు చెందిన దంపతులు అనారోగ్య కారణాలతో దుర్గా సింగ్ను ఆశ్రయించారు. ఇంట్లో, వ్యవసాయ పొలంలో గుప్త నిధులు ఉన్నాయని, తీయకపోతే పద్మ చనిపోతుందని నకిలీ స్వామి భయపెట్టాడు. ఇంట్లో గుంత తీసి లక్ష్మీదేవి విగ్రహాన్ని పాతాడు. విగ్రహాన్ని విదేశాల్లో రూ.150 కోట్లకు అమ్ముతానని, బాధితుల వద్ద రూ.40 లక్షలు వసూలు చేశాడు.
MBNR: కోయిలకొండ అంకిళ్ల గ్రామానికి చెందిన కావలి రామచందర్ ముదిరాజ్ తన అభిమాన నేత కేటీఆర్ను కలిసేందుకు హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టాడు. కేటీఆర్ నాయకత్వానికి గౌరవం చూపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపారు. బంజారాహిల్స్ తెలంగాణ భవన్లో ఆయన కేటీఆర్ను కలిసిన తర్వాత మద్దతు తెలపడం లక్ష్యమని చెప్పాడు.
SRCL: జిల్లాలో ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ATP: గుంతకల్లులో భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి టీడీపీ మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అబుల్ కలాం చేసిన సేవలను కొనియాడారు. విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్దికి ఎంతగానో కృషి చేశారన్నారు.
JGL: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
KDP: కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పథకం మార్చి నెలలో శ్రీకారం చుట్టనుంది. దీని కింద డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహం కోసం రుణం తీసుకోవచ్చు. రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పావలా వడ్డీకి మాత్రమే ఈ రుణాలు పొందవచ్చు. ఈ రుణాన్ని 48వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.
JN: బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఘనపూర్లో నేతలతో కలిసి వెంకటేశ్వర్లు పరిశీలించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలంతా బీజేపీ వెంటే ఉన్నారని అన్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాలు త్వరలోనే 4K వెర్షన్లో రీ-రిలీజ్ కానున్నాయి. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘పోకిరి’ సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు పూరి ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ADB: నెరడిగొండ మండలంలోని దుర్బాతండా గ్రామంలో ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే పార్టీలు, అనంతరం అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్క అర్హునికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ASR: రంపచోడవరం యర్రంరెడ్డినగర్ నివాసంలో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆశాజ్యోతి(28) ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ సన్యాసినాయుడు మీడియాకు తెలిపారు. దేవీపట్నం మండలానికి చెందిన ఆశాజ్యోతి, శివకుమార్ దంపతులు హోటల్ నిర్వహిస్తూ రంపచోడవరంలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.
హోలీ పండగను ప్రజలు మార్చి 3 లేదా 4వ తేదీనా జరుపుకోవాలా? అన్న ఆలోచనలో పడిపోయారు. రంగుల హోలీ మార్చి 4న జరుపుకుంటారు. ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2 సాయంత్రం 5:55 నుంచి మార్చి 3 సాయంత్రం 5:07 వరకు ఉంటుంది. అయితే, మార్చి 3న చంద్రగ్రహణం ఉండటం వల్ల చాలా మంది పండితులు, ద్రిక్ పంచాంగం వంటి సోర్స్ ప్రకారం రంగుల హోలీని మార్చి 4నే జరుపుకోవాలని సూచిస్తున్నారు.
BDK: దమ్మపేట మండలం పట్వారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్తుపల్లి ప్రముఖ వైద్యశాలలు శ్రీనిధి హాస్పిటల్ , లైఫ్ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషమన్నారు.