అల్లూర: కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలో చెత్త సేకరణ కార్యక్రమం పక్కాగా అమలుచేస్తున్నామని పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఐవీఆర్ఎస్ కాల్స్కు స్పందించాలన్నారు. సోమవారం శింగరాళ్లపాడు, మంగళవారం లుబ్బర్తి, బుధవారం గింజర్తి, గురువారం చింతలపూడి, శుక్రవారం రోడ్డు చింతలపూడి, శనివారం లొద్దిపాకలు గ్రామాల్లో చెత్త సేకరణ చేపడుతున్నామన్నారు.
SRPT: కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన పసుపులేటి నాగరాజు ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. గడ్డి మిషన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై ఈ నెల 9వ తేదీన నాగరాజు విషయం తాగాడు. ఖమ్మంలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
MDK: విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా శనివారం మనోహరాబాద్ మండల పరిధిలోని కాళ్లకల్ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజాబాట నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రజలు విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఏఈ రాజ్ కుమార్ తెలిపారు. ఈ ప్రజా బాట కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,910 పెరిగి రూ.1,59,280కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 పెరిగి రూ.1,46,000గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.2,90,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
SKLM: ఏపీ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 4.75 కోట్లు ఎక్స్ గ్రేషియా శనివారం విడుదల చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 90 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాగా, మిగిలిన 5 మంది ఖాతాల్లో త్వరలో జమ చేస్తామని మంత్రి తెలిపారు.
ADB: నార్నూర్ మండలంలోని బోధి బుడోకాన్ కరాటే అసోసియేషన్ విద్యార్థులు HYDలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు బయలుదేరారు. నేటి నుంచి 23వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో వారు పాల్గొననున్నట్లు మాస్టర్లు ముకేశ్, రాము తెలిపారు. జిల్లాస్థాయిలో సత్తా చాటి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొత్తం 13 విద్యార్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు.
2026 టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పిచ్ క్యూరేటర్లపై విపరీతమైన ఒత్తిడి ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. మెగా టోర్నీ కోసం నాణ్యమైన పిచ్లను సిద్ధం చేయడం సవాలుతో కూడుకున్న పని అని ఆయన పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా వికెట్లు రూపొందించడంలో క్యూరేటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని మోర్కెల్ అభిప్రాయపడ్డాడు.
GNTR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. 189.9 కి.మీ మేర నిర్మించే ఈ రోడ్డు డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ కోసం జిల్లా వారీగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పటికే మెజారిటీ ప్రభుత్వ, ప్రైవేటు భూములను కేంద్రానికి అప్పగించారు. మిగిలిన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయనున్నారు. ప్రాథమిక సర్వేలు కొనసాగుతున్నాయి.
అన్నమయ్య: పీలేరు పట్టణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసినట్లు పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
W.G: మొగల్తూరు ఆనంద్ రొయ్యల ఫ్యాక్టరీలో శనివారం కార్మికులకు అగ్నిప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫైర్ ఆఫీసర్ భాస్కర్ రామమ్ కార్మికులకు ఫైర్ సేఫ్టీపై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.
E.G: నల్లజర్ల మండలo పుల్లలపాడు ఎకో హోటల్ వద్ద బీట్ కానిస్టేబుల్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం ఉదయం ఢీకొంది. ఈ ప్రమాదంలో నల్లజర్ల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రవికు తీవ్ర గాయాలు కాగా పోలీసులు అతన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో దర్యాప్తు చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలోని పర్యాటక రంగం త్వరలోనే సరికొత్త రూపు సంతరించుకోనుంది. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కలెక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలో ఆదాయం వెళ్లడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు పలు కీలక ప్రాజెక్టులను ప్రతిపాదించారు. లతీఫ్ సాబ్ గుట్ట, కాపురాల గుట్టలపై రోప్ లెవెల్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
SRD: నారాయణఖేడ్ RTC డిపో డ్రైవర్ పాపయ్య అదృశ్యమైనట్లు హద్నూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆయన బైక్పై వెళ్తూ కూతురుతో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ భయంగా ఉంది చనిపోతాను.. మీరంతా బాగుండాలని ఫోన్ కట్ చేసి మంజీరా నదిలో దూకినట్లు సమాచారం. ఘటన స్థలంలో పాపయ్యకు సంబంధించి వస్తువులు, బైక్, సెల్ ఫోన్ గుర్తించి హద్నూర్ పోలీసులకు సమాచారమివ్వగా గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు.
GDWL: కేటిదొడ్డి గ్రామ రైతులు తమ రబీ సీజన్ పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేష్ సూచించారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు రిజిస్టర్, పంట వివరాల నమోదు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, సాయం పొందేందుకు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
VKB: వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహ రెడ్డి పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని అధికారులు హెచ్చరించారు. 8332957830 నంబర్ నుంచి ఫోన్ చేసి, ఆస్తి పన్ను చెల్లించాలని కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ నంబర్ నుంచి కాల్స్ వస్తే ఎత్తవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.