VZM: పొలిపల్లి పైడితల్లి అమ్మవారికి నేత్రోత్సవం శుక్రవారం కన్నులపండువగా నిర్వహించారు. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా ఆనవాయితిగా జరుగుతుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వంశ పారంపర్య ధర్మకర్తలు, వాకచర్ల కుటుంబీకులు మంగళవాయిద్యాలతో ఆలయానికి చేరుకొని పసుపు, కుంకుమలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
KKD: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ సానా సతీష్ ఢిల్లీలో ఎన్హెచ్ఐఐ ఛైర్మన్ సంతోశ్ కుమార్ యాదవన్ను కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. రామవరం-తాళ్లూరు మధ్య బైపాస్ నిర్మాణం వల్ల రైతుల భూములు పోతున్నాయని, దానికి బదులు ఎలివేటెడ్ ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు.రైతుల ప్రయోజనాలను దృష్ట్యా జాతీయ రహదారి అలైన్మెంటు పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
BDK: కూంబింగ్ పేరుతో బలగాలు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, అదే సమయంలో అటవీ సంపద నాశనమవుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని తెలిపారు.
PPM: ఏపీ సీఎం చంద్రబాబును నిన్న అమరావతిలో పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటి శాశ్వత పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు.
అల్లూరి: స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు ఆన్లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు మండలం మంప ఎస్సై శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. శుక్రవారం రేవళ్లలో పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. యూపీఐ, స్కాలర్షిప్ పేరుతో నేరగాళ్లు వల వేస్తున్నారన్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు, మెసేజ్లపై క్లిక్ చేయవద్దన్నారు.
కృష్ణా: గుడివాడ పురపాలక కమిషనర్ ఎస్. మనోహర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఏఈ, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బందితో కలిసి కర్మికానగర్, సాయినగర్, చెంచుపేట ప్రాంతాలలో పర్యటించారు. శనివారం ఉదయం స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించి, లీకేజీలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
MBNR: బాలానగర్ మండలం పెద్దాయపల్లి పరిధిలోని ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 25 వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సుభాష్ శుక్ల తెలిపారు. శుక్రవారంతో గడువు ముగియడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 5వ తరగతి చదువుతున్న ST విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మార్కాపురం జిల్లా కనిగిరిలో దళితుల భూమిని రాత్రిపూట ఫినిషింగ్ రాళ్లతో అక్రమంగా కబ్జా చేశారని స్థానిక దళితులు ఆరోపిస్తున్నారు. ఈ భూ-కబ్జాపై ల్యాండ్ గ్రాబింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
NZB: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 5వ తరగతి ప్రవేశ పరీక్ష రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. ఆర్మూర్ కేంద్రంలో 504 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, పెన్ను, గుర్తింపు కార్డుతో ఉదయం 9:30 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు.
AKP: పరవాడ మండలం తానాం గ్రామంలో శుక్రవారం రాత్రి షటిల్ బ్యాట్మెంటన్ పోటీలను మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. గ్రామంలో పరదేశిమాంబ జాతర సందర్భంగా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు తగిన ప్రోత్సహం అందించినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అల్లూరి: శుక్రవారం రాత్రి అరకు ఎన్టీఆర్ జంక్షన్ వద్ద రోడ్ అవేర్నెస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని సీఐ ఎల్.హిమగిరి తెలిపారు. వాహన తనిఖీలు నిర్వహించారు. కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. క్షేమంగా గమ్య స్థానాలకు చేరేందుకు డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.
WNP: విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ప్రణాళికాబద్ధమైన చదువు అవసరమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలో గురుకుల విద్యార్థులకు ఆయన మోటివేషన్ తరగతులు నిర్వహించారు. చదువును భారం కాకుండా ఇష్టపడి చదవాలని, లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.
BDK: గార్ల మండలంలో ఇల్లందు నియోజకవర్గ కోరం కనకయ్య పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనియాకుల రామారావు శుక్రవారం ప్రకటించారు. ముందుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేస్తారని అన్నారు. అలాగే ITDA నుంచి గిరిజనులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెసింగ్ను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.
HYD: హుస్సేన్ సాగర్లో ఈరోజు ఉదయం తేలియాడుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని లేక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా మృతదేహం తేలియాడుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి వెలికితీశారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని, మృతదేహాన్ని గుర్తింపు నిమిత్తం గాంధీ మార్చురీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.
AO: లంచం తీసుకుంటూ మరో అధికారి ACBకి చిక్కాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాప్ పెట్టుకునేందుకు అనుమతి అడిగిన వ్యక్తి నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ కంపా సురేష్ రూ.20 లంచం అడిగాడు. బాధితుడు ACBని ఆశ్రయించడంతో.. శుక్రవారం సురేష్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సురేష్, అలాగే అతనికి సహాయం చేసిన శివరామకృష్ణ అనే వ్యక్తినీ అరెస్ట్ చేశారు.