HYD: కొంపల్లి సర్కిల్-56లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పారిశుధ్య తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ చెత్త సేకరణ ప్రత్యామ్నాయ రోజుల్లో జరుగుతున్నట్లు గుర్తించి, ఇకపై ప్రతిరోజూ డోర్ టు డోర్ కలెక్షన్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఏటీ వాహనాలకు చెత్త ఇవ్వని గృహాలను గుర్తించి అవగాహన కల్పించడంతో పాటు పునరావృతమైతే జరిమానా విధించాలన్నారు.
తిరుపతి జిల్లాలో ఇంటర్ మొదటి సం. పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా జరిగింది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ జరిగిన పరీక్షకు 797మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మొత్తం 31014 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 30217 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.
PPM: గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఎంపీపీ కె. దీనమయ్య ‘సమ్మర్ క్రాష్ ప్రోగ్రాం’ జీపును జెండా ఊపి ప్రారంభించారు. వేసవి కాలంలో చేతి పంపుల మరమ్మతులు, నిర్వహణ కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కొరత లేకుండా చూడడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో MPDO శ్రీనివాసరావు, RWS జేఈ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. KGBVలో చదువుతున్న విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యలను ప్రస్తావించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి సర్టిఫికెట్లు సమయానికి జారీ కావడం అత్యంత అవసరమని అన్నారు. కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల సమస్యలను కూడా సభ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువచ్చారు.
KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చొప్పదండిలో బీజేపీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ తోపులాట జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని నినాదాలు చేశారు.
MBNR: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో అనిల్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా: నేపాల్ రంగసాల ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి చెందిన పవర్ లిఫ్టర్ దుర్గా సత్యనారాయణ 66 కేజీల విభాగంలో 610 కేజీల బరువు ఎత్తి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించాడు. ఈ క్రమంలో ఆయనను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఇవాళ అభినందించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
W.G: అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని యనమదురు డ్రైన్ ముంపు సమస్యను ఆయన ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో అధికంగా వరదలు రావడం వల్ల సమీపంలోని పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. దీనికోసం కూటమి ప్రభుత్వం నిధులు సమకూర్చడం జరిగిందన్నారు.
NLG: ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించారు.
NGKL: ఊర్కొండ మండలం జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి రూ.5,000 నగదును అందజేశారు. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని ధ్యాప నిఖిల్ రెడ్డి భరోసా ఇచ్చారు.
BDK: ఆళ్లపల్లి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కళ్యాణ లక్ష్మీ, సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ పథకం కింద 24 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 24,02,784 పంపిణీ చేసి, పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించారు.
SDPT: ప్రభుత్వం అందించే పథకాలు,సబ్సిడీలు అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కౌన్సిలర్ వనం రమేష్ సూచించారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట వార్డు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన సోమవారం పరిశీలించారు. ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే స్పందించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
GNTR: చట్టసభల విలువైన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళికతో సభకు హాజరుకావాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. సోమవారం అసెంబ్లీలోని జనసేన శాసనసభా పక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు.
డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ను నిర్మాత అల్లు అరవింద్ కుటుంబ సమేతంగా కలిశారు. మార్చి 6న హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు పెళ్లికి పవన్ కళ్యాణ్ దంపతులను అల్లు అరవింద్ ఆహ్వానించారు. కాగా ఇప్పటికే దుబాయ్లో పార్టీస్, పసుపు దంచుడు వంటి కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
MDK: కాళికా మాత ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకుని సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కాళికా మాత ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అర్చకులు ఆశీస్సులు అందజేసి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.