• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

కృష్ణా: మచిలీపట్నానికి చెందిన కర్ల శేషలతకు వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ.24001 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ ఈరోజు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. శేషలత వైద్య చికిత్స నిమిత్తం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారన్నారు.

February 24, 2026 / 01:45 PM IST

కల్వకుర్తిలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష

NGKL: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, న్యాయవాదులు కృష్ణయ్య, ప్రశాంత్, జంగయ్య తదితరులు కూర్చున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే న్యాయవాదుల రక్షణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 01:43 PM IST

‘గ్రంథాలయ సెస్‌లు విడుదల చేయాలి’

SKLM: జిల్లా గ్రంథాలయ సంస్థకు పట్టణ, గ్రామీణ పంచాయతీల నుంచి రావలసిన ఎనిమిది శాతం గ్రంథాలయ సెస్సులను విడుదల చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు కోరారు. సారవకోట మండల కేంద్రంలోని శాఖా గ్రంధాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంధాలయ సంస్థలో 70 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్నారు.

February 24, 2026 / 01:42 PM IST

నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక: చంద్రబాబు

AP: 2020 JAN, FEBలో టెండర్ల నిబంధనలను మార్చారని CM చంద్రబాబు అన్నారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు, విచారణకు ఆదేశించారని తెలిపారు. 2022 ఆగస్టులో బీటా సిటోస్టిరాల్‌తో నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చిందన్నారు. సీఎఫ్ టీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు వస్తే తొక్కిపెట్టారని తెలిపారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని NDDB ఇచ్చిన రిపోర్టునే తాను చెప్పానని పేర్కొన్నారు.

February 24, 2026 / 01:41 PM IST

గుమ్మలక్ష్మీపురంలో జీవనోపాధుల సర్వేపై సమీక్ష.

PPM: జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధారాణి జీవనోపాధుల సర్వే, ప్రాజెక్ట్ ప్రాధాన్యతా పనులు, రికవరీలపై మండల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మహిళా మార్ట్‌ను సందర్శించి అమ్మకాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ఫైనాన్స్, మండల సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 01:41 PM IST

మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ

VKB: దోమలో MLA రామ్మోహన్‌రెడ్డి సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో మహిళా డ్వాక్రా వర్క్ షెడ్జ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించినట్లు సర్పంచ్ మాలి శివకుమార్‌రెడ్డి తెలిపారు. మహిళల స్వయం ఉపాధి అభివృద్ధికి ఈ వర్క్ షెడ్జ్ ఉపయోగపడుతుందని, మహిళా సంఘాల కార్యకలాపాలకు తోడ్పడుతుందన్నారు. వార్డు సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:40 PM IST

అతిగా ఫోన్ చూస్తున్నారా?

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడకం వ్యసనమైంది. అతిగా ఫోన్ వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం స్క్రీన్ చూడటం వల్ల కళ్లు పొడిబారడం, చూపు మందగించడం జరుగుతుంది. సోషల్ మీడియా వాడకం వల్ల  ఆందోళన, నిద్రలేమి వంటివి పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతారు. మెడ, వెన్నునొప్పి వస్తుంది. అందుకే డిజిటల్ డిటాక్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

February 24, 2026 / 01:38 PM IST

రజక సంఘం ఆధ్వర్యంలో బెజ్జంకిలో నిరసన

SDPT: రజకులపై జరిగిన దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెజ్జంకి మండల రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని మండల అధ్యక్షుడు ధీటి రాజు డిమాండ్ చేశారు. వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:38 PM IST

పేద కుటుంబాలకు అండగా నిలబడతాం: ఎమ్మెల్యే

MDCL: అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయాలను సమర్థవంతంగా అందిస్తామని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 2 లక్షల 25 వేల విలువైన ఎల్‌వోసీని అందజేశారు.

February 24, 2026 / 01:38 PM IST

గడువులోపే పనులు పూర్తి చేయాలని: ఎమ్మెల్యే

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

February 24, 2026 / 01:37 PM IST

గడువులోపే పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.

February 24, 2026 / 01:37 PM IST

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కుల హత్య సిగ్గుచేటు

BDK: భద్రాచలం లో POW డివిజన్ కమిటీ మహిళ నాయకులు సమావేశమయ్యారు. పాయం రాజమ్మ పాల్గొని మాట్లాడుతూ.. మల్లన్న జాతరలో చాకలి కుటుంబంపై , ఐదు నెలల పసికందు ను కాలితో గొంతు నలిమి చంపడం దారుణమని మండిపడ్డారు. రెడ్డి దొరలు ఇప్పటివరకు హంతకులను పట్టు కోక పోవడం పోలీసులు హంతకుల కే కొమ్ములు కాయడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య సిగ్గుచేటు అన్నారు.

February 24, 2026 / 01:36 PM IST

జిల్లాకు 2390 టన్నుల యూరియా

KDP: రబీ వ్యవ సాయ అవసరాలకు కడప, అన్నమయ్య జిల్లాలకు 2900 టన్నుల యూరియా సోమవారం కడప రైల్వే రేక్ పాయింట్‌కు వచ్చింది. ఈ మేరకు వచ్చిన ఎరువులను కడప, అన్నమయ్య నంద్యాల, కర్నూలు జిల్లాకు సరఫరా చేశారు. ఇందులో కడప జిల్లాకు 2,390 టన్నులు రాగా.. ఇందులో మార్క్‌ఫెడ్ 1,200 టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 1,190 టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

February 24, 2026 / 01:35 PM IST

CMRF చెక్కు అందజేత..!

MDK: కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సుమలతకు రూ.53,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కును జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి అందజేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ఈ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆమె తెలిపారు. వెంకటేశం, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:34 PM IST

తండాలో సమస్యలను పరిశీలించిన కమిషనర్

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని నజీరాబాద్ తండాలో పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య సందర్శించారు. తండాలో అండర్ డ్రైనేజ్, వీధి దీపాలు, సీసీ రోడ్లు, ఎక్కడ లేవో ఆ ప్రదేశాలను పరిశీలించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలో ప్రతి ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా బుట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి వైస్ ఛైర్మన్ హనుమంతు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:33 PM IST