• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీపీవో

VZM: జిల్లా పంచాయతీ అధికారి డి. వి.మల్లిఖార్జున శుక్రవారం కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. స్వర్ణ పంచాయతీ ఇంటి పన్నుల బకాయిలు 2025, 26 వరకు సంబంధించి రూ 1.48 లక్షలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ 65 లక్షలు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. పంచాయతీ షాపుల అద్దెలు బకాయిలు ఉన్నాయని, త్వరలో వసూలుకు చర్యలు చేపడతామన్నారు. ఈఓపీఆర్డీ ఉన్నారు.

February 20, 2026 / 01:15 PM IST

‘వచ్చే నెల 31 లోపు దరఖాస్తులు చేసుకోవాలి’

VZM: మెరకముడిదాం మండలంలోని స్దానిక గర్భం AP మోడల్‌ స్కూల్లో 2026- 27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ అరుణకుమారి శుక్రవారం. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి వచ్చే నెల 31లోపు www.apms.apcfss.in వైబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 12 తేదిన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

February 20, 2026 / 01:15 PM IST

గ్రామపంచాయతీలకు కేంద్రం GOOD NEWS

TG: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పింది. తాజాగా 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతలో భాగంగా 387.53 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదల కాగా రెండో విడత కింద రూ. 387 కోట్లు విడుదల చేసింది. తాజాగా మూడో విడత నిధులు రిలీజ్ చేయడంతో దీంతో ఇప్పటివరకు 1034.42 కోట్లు విడుదలయ్యాయి.

February 20, 2026 / 01:13 PM IST

నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ బాధ్యతలు స్వీకరణ

GDWL: మున్సిపల్ నూతన చైర్‌పర్సన్‌గా తుమ్మల జయలక్ష్మి శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆమెను అభినందించారు. అందరి సహకారంతో గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

February 20, 2026 / 01:11 PM IST

‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి’

AKP: అచ్యుతాపురం మండలంలోని పూడిమడక జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఎస్సై సుధాకర్ విద్యార్థులకు డ్రగ్స్, మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. అనుమానాస్పద సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి, మోసాలకు గురికావద్దని హెచ్చరించారు.

February 20, 2026 / 01:08 PM IST

జిల్లా యాదమరి సమీపంలో విషాదం

CTR: యాదమరి సమీపంలో బావిలో పడి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు సిబ్బంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

February 20, 2026 / 01:08 PM IST

‘టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను కొనసాగించాలి’

MNCL: రెవిన్యూ శాఖలో ఎంతో కాలంగా పనిచేస్తున్న టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లను కొనసాగించాలని అధ్యక్షుడు వెంకటేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు టీఎన్జీవోస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పథకాల అమలు , ఎన్నికల నిర్వహణలో కృషి చేసిన కంప్యూటర్ ఆపరేటర్లను ఇతర ఉద్యోగాలకు వెళ్లాలనడం కష్టంగా ఉందని తెలిపారు.

February 20, 2026 / 01:07 PM IST

హైవేపై నిర్మాణ పనులు.. దుమ్ముతో ఇక్కట్లు

ASR: 516-ఈ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జీ.మాడుగుల మండలంలో హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పలుచోట్ల మట్టి పనులు చేపట్టారు. నీళ్లతో తడపకపోవడం వల్ల దుమ్ము, ధూళి విపరీతంగా గాలిలోకి లేస్తుంది. చుట్టుపక్కల ఇళ్లలోకి, వాహనదారుల కళ్లలోకి దూరటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.

February 20, 2026 / 01:06 PM IST

లంచ్ తర్వాత స్వీట్స్ తింటున్నారా?

చాలామందికి భోజనం తర్వాత తీపి తినడం అలవాటు, కానీ దీనివల్ల అనవసరమైన క్యాలరీలు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. చక్కెరతో చేసిన స్వీట్లకు బదులుగా ఒక చిన్న ముక్క బెల్లం తినడం ఉత్తమం. ఇది ఆహారం త్వరగా అరిగేలా చేయడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఐరన్ అందిస్తుంది. రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యంతో పాటు తీపి కోరికను కూడా ఇది తీరుస్తుంది.

February 20, 2026 / 01:05 PM IST

‘ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి’

CTR: వాతావరణ మారుతూ ఉందని ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణం పొడిగా మారిందన్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. నిల్వచేసిన ఆహారాన్ని తినటం మానుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటించాలన్నారు.

February 20, 2026 / 01:05 PM IST

సీఎం చంద్రబాబుతో నెల్లూరు ఎంపీల భేటీ

NLR: అంతర్జాతీయ స్థాయిలో ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. శుక్రవారం అనంతరం ఆయనతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు.

February 20, 2026 / 01:04 PM IST

తెనాలిలో వైఎస్ షర్మిల పర్యటన

GNTR: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం తెనాలిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

February 20, 2026 / 01:03 PM IST

పంచాయతీ రాజ్ శాఖలో భారీగా పదోన్నతులు

TG: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రభుత్వం భారీగా పదోన్నతులు కల్పించింది. డిప్యూటీ సీఈవోలుగా ఉన్న 27 మందికి సీఈవోలుగా పదోన్నతులు వచ్చాయి. డిప్యూటీ సీఈవోలుగా ఉన్న మరో 55 మందికి ఎంపీడీవోలుగా ప్రమోషన్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రజా భవన్‌లో అధికారులంతా కలిసి మంత్రి సీతక్కను సన్మానించారు.

February 20, 2026 / 01:03 PM IST

రెండేళ్లుగా తలుపులు తెరవని జడ్పీటీసీ కార్యాలయం

SKLM: మండల కేంద్రం సారవకోట జడ్పీటీసీ వి. నాగేశ్వరమ్మ గత రెండేళ్లుగా కార్యాలయం తలుపులు తెరవకపోవడం విశేషం. ఆమె జిల్లా ప్రదేశ్ ప్రాదేశిక సభ్యురాలుగా ఎన్నికై సుమారు 5 ఏళ్ళు అవుతున్నాయని కాలం కూడా దగ్గర అవుతుందని ఆమె కార్యాలయానికి రాకపోవడం తలుపులు తెరవకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

February 20, 2026 / 01:02 PM IST

ALERT: మీ ఏసీని క్లీన్ చేశారా..?

వేసవి ఎండలు మొదలైన నేపథ్యంలో ఏసీలు ఆన్ చేసే సమయం వచ్చేసింది. అయితే వీటిని ఉపయోగించే ముందు ఫిల్టర్లను శుభ్రపరచడం తప్పనిసరి. మొదట విద్యుత్ సరఫరా నిలిపివేసి, ఫిల్టర్లను జాగ్రత్తగా తొలగించాలి. అనంతరం వాటిని నీటితో కడిగి, పూర్తిగా ఆరిన తర్వాతే తిరిగి అమర్చాలి. దీనివల్ల ఏసీ పనితీరు మెరుగుపడటమే కాకుండా, గాలి నాణ్యత పెరిగి విద్యుత్ కూడా ఆదా అవుతుంది.

February 20, 2026 / 12:55 PM IST