భువనగిరి జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు కలెక్టర్ హనుమంతరావు కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇకపై హెల్మెట్ లేని బైక్లకు పెట్రోల్ పోయకూడదని బంక్ యాజమాన్యాలను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.
టాలెంటెడ్ నటి సాయి పల్లవి తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకుంది. తాజాగా జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ‘అమరన్’ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. దీంతో ఆమె కెరీర్లో మొత్తం 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు చేరాయి. ప్రేమమ్, ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, గార్గి, విరాటపర్వం, అమరన్ సినిమాలతో ఆమె ఈ ఘనత సాధించింది.
TG: ములుగు జిల్లా మండపేటలోని రాజుపేట-లక్ష్మీ నర్సాపూర్లో 2026 మార్చి 3 నుంచి 7 వరకు జరిగే శ్రీ నాగులమ్మ మహాజాతరకు ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. మంత్రి సీతక్కను కలిసిన ఆలయ అధికారులు కలిసి.. నాగదేవత జాతరకు రావాలంటూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు.
మహబూబ్ నగర్ మున్సిపల్ తొలి మేయర్ గుమ్మడం మమత శ్రీనివాసను పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ లక్ష్మయ్య, బీసీ విద్యార్థి సంఘం నేత వెంకటేశ్ శాలువా, పూలమాలతో సత్కరించారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కలిసి పని చేయాలని నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
RR: పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ముస్తఫా అన్నారు. SDNRలో వారు మాట్లాడుతూ.. కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని అన్నారు. జాతరకు రజక దంపతులు వెళ్ళగా, వారిపై దాడి చేయగా దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు.
WG: పాలకొల్లు మండలం కాపవరంలో ఆదివారం రూ.15 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్, డ్రైన్ పనులకు మాజీ MLC అంగర రామ్మెహన్ రావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కోడి విజయభాస్కర్, సర్పంచ్ కోలాటి రాద, ఉపసర్పంచ్ అంగర చిన్న పాల్గొన్నారు.
MNCL: కడెం మండలం దోస్త్ నగర్ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడెం వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ 2 రోజుల సెలవుల అనంతరం సోమవారం పునః ప్రారంభం కానుంది. నిన్న, ఇవాళ సాధారణ సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను తీసుకొచ్చి సరసమైన ధరలు పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటలలోపు మాత్రమే పత్తిని యార్డులోకి అధికారులు అనుమతించనున్నారు.
E.G: నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాకరపర్రులో శ్రీ గంటాలమ్మ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన గ్రామ దేవత గంటాలమ్మ దేవి కృప దయ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
PLD: తొలితరం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, పుల్లరి ఉద్యమ వీరుడు కన్నెగంటి హనుమంతు 104వ వర్ధంతి సందర్భంగా దుర్గి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సాధనలో కన్నెగంటి హనుమంతు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ADB: హైదరాబాద్లో ఈనెల 23 నుంచి 28 వరకు జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్ క్లస్టర్ పోటీలకు ఆదిలాబాద్ స్విమ్మింగ్ కోచ్ కృష్ణ సాంకేతిక నిపుణుడిగా ఎంపికయ్యారు. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ స్థాయి పోటీల్లో కీలక బాధ్యతలు దక్కడంపై క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందించారు.
మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావును బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా చేసిన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్, మల్కాజిగిరి నియోజకవర్గం బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ ముందు బైటాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు.
ACC ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్పై 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 134 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 88 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో తేజల్ (51) అర్ధసెంచరీతో రాణించగా, బౌలింగ్లో ప్రేమ రావత్ 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
BDK: పాల్వంచ సుగుణ గార్డెన్స్లో ఆదివారం జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన సతీమణి మాధురి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూకంటి గోపాల్ రావు వాణి శ్రీ దంపతుల కుమారుడు సుమంత్, ప్రతాపనేని బుచ్చిబాబు -తనూజ దంపతుల కుమార్తె రేష్మి తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు.