• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆలయ వార్షికోత్సవాలకు ఆహ్వానం

SRD: నారాయణఖేడ్ శివారులోని శ్రీ భక్త మార్కండేయ చంద్రమౌళీశ్వర ఆలయంలో ఈనెల 23న ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయని నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు హనుమంతరావుపేట గ్రామంలోని సర్పంచ్, గ్రామస్తులకు కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. అదేవిధంగా ఖేడ్‌లో కరణ్ గజేంద్ర భారతి మహారాజ్‌ను కూడా ఆహ్వానించి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు.

February 20, 2026 / 11:03 AM IST

విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి: తిరుపతి

BHPL: గణపురం (M) కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ మొదలైంది. 6వ తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు HM తిరుపతి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోపు TGMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని HM సూచించారు.

February 20, 2026 / 10:59 AM IST

‘అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలి’

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కార్పొరేటర్లు రాచకొండ గోపాల్ రావు, సుధమల్ల హరికృష్ణ కోరారు. శుక్రవారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామన్నారు.

February 20, 2026 / 10:58 AM IST

‘అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించండి’

AKP: నర్సీపట్నంలో అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నేతల నాగేశ్వరరావు కోరారు. దళితులకు శుభకార్యాలు, సమావేశాల కోసం ప్రత్యేక స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించి భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

February 20, 2026 / 10:55 AM IST

సత్తా చాటిన ఉట్నూర్ విద్యార్థులు

ADB: రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ఉట్నూర్‌లోని ‘వికాసం’ ప్రత్యేక బాలల పాఠశాల విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించి సత్తా చాటారు. విజేతలను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. వైకల్యం అనేది ప్రతిభకు అడ్డుకాదని విద్యార్థులు నిరూపించారని కొనియాడారు. వీరికి భవిష్యత్తులో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

February 20, 2026 / 10:53 AM IST

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

KMM: కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలో మెట్టెల రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి రూ. 9000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. మృతుడు రవి నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబానికి అండగా నిలిచినట్లు నాయకులు వెల్లడించారు.

February 20, 2026 / 10:52 AM IST

ఇలాంటి నాయకుడు గ్రామానికి అవసరం

RR: కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామంలో గత 4 రోజులుగా 1వ వార్డులో బోరు మోటార్ పాడైంది. ఈ విషయాన్ని వెంటనే స్థానికులు వార్డ్ మెంబర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా, వారు సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డికి తెలిపారు. సర్పంచ్ వెంటనే బోరుమోటర్‌ను బాగు చేయించారు. సమస్యకు వెంటనే స్పందించే ఇలాంటి గొప్ప నాయకుడు గ్రామంలో ఉండటం గ్రామానికి ఎంతో అవసరమని ప్రజలు అన్నారు.

February 20, 2026 / 10:51 AM IST

ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించిన ఎమ్మెల్యే

BHPL: జగ్గయ్యపేట గ్రామానికి చెందిన పలువురు అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.

February 20, 2026 / 10:50 AM IST

‘వృషకర్మ’ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా?

అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్‌ దండు కాంబోలో ‘వృషకర్మ’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే మార్చి తొలివారంలో ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు స్టార్ట్ చేశారట. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

February 20, 2026 / 10:50 AM IST

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి

SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు తమ ప్రాంతీయ సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. మంత్రి వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

February 20, 2026 / 10:49 AM IST

కూటమి నేతల అత్యవసర సమావేశం

AP: శాసన మండలిలో YCP ఆందోళనల నడుమ కూటమి నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో.. TDP, జనసేన, BJP ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వైసీపీ చర్యలతో తిరుమల వెంకన్నకు సభలో అవమానం జరిగిందని, దీన్ని తీవ్రంగా పరిగణించాలని నేతలు నిర్ణయించుకున్నారు. క్షమించారని ఈ నేరాన్ని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు.

February 20, 2026 / 10:49 AM IST

శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో మాఘమాస పూజలు

ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాఘమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకాలు నిర్వహించారు. మాఘమాస శుక్రవారాల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, ఆర్థికాభివృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దర్శించుకున్నారు.

February 20, 2026 / 10:48 AM IST

ఈనెల 23 నుంచి సైన్స్ సమగ్ర మహోత్సవం: డీఈవో

NLR: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ సమగ్ర మహోత్సవంలో భాగంగా సైన్స్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని 23వ తేదీ నుంచి నిర్వహించనున్నామని డీఈవో బాలాజీరావు తెలిపారు. ఇండియా, ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సాధించే దిశగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి పాఠశాల నుంచి గరిష్టంగా పది టీంలు పాల్గొనవచ్చని చెప్పారు.

February 20, 2026 / 10:48 AM IST

22న బేస్ లైన్ పరీక్షలు

MDK: ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు బేస్ లైన్ పరీక్షలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు డీఈవో విజయ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గల అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు ఈ విషయం విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అభ్యాసకులు తప్పకుండ పరీక్షలకు హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివరాలకు ఎస్.వెంకటస్వామి కో-ఆర్డినేటర్ 8008403635 కు ఫోన్ చేయాలని సూచించారు.

February 20, 2026 / 10:46 AM IST

కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

కృష్ణా: అవనిగడ్డలో నూతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఈనెల 22వ తేదీ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అవనిగడ్డలోని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్వగృహంలో ఆయనను కమిటీ పెద్దలు ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) కలిసి ఆహ్వాన పత్రిక అందచేశారు. ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానం పలికారు.

February 20, 2026 / 10:45 AM IST