• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్రామాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: సొంటెన్న

KRNL: కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ సొంటెన్న, బూత్ ఇన్ ఛార్జ్ దుమ్మల శివ, నాయకులు రామలింగ, నరసయ్య స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరు మండలం హెచ్ మురవణి గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పని చేయాలన్నారు.

February 20, 2026 / 02:15 PM IST

మహిళా సమైఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

MBNR: చిన్న చింతకుంట మండలం పల్లమర్రిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా సమైఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, మహిళల ఆర్థికాభివృద్ధి కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:14 PM IST

భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

MBNR: చిన్న చింతకుంట మండలం పల్లమర్రిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా సమైఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, మహిళల ఆర్థికాభివృద్ధి కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:14 PM IST

‘కడియం శ్రీహరి రాజీనామా చేయాలి’

JN: కడియం శ్రీహరి నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శుక్రవారం స్పందించిన ఆయన, శ్రీహరి ప్రవర్తన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి కీలక పదవులు అనుభవించారని పేర్కొన్నారు.

February 20, 2026 / 02:14 PM IST

జడ్చర్లలో నకిలీ ఓట్లు తొలగించాలి: ఎన్నికల కమిషన్

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో అనర్హమైన, నకిలీ ఓట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి మున్సిపల్ కమిషనర్‌కు కీలక ఉత్తర్వులు అందాయి. పట్టణంలోని 4వ వార్డుకు చెందిన పెద్ది వెంకటేష్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి గతంలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగించాలని కమిషన్ స్పష్టం చేసింది.

February 20, 2026 / 02:13 PM IST

విద్యార్థులకు ఆరోగ్య శిబిరం ఏర్పాటు

SDPT: బెజ్జంకి మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై సూచనలు అందించి, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. కంజంక్టివైటిస్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి విధానం, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డా. మాధురి, సులోచన, సిస్టర్ అనిత ఉన్నారు.

February 20, 2026 / 02:12 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకుడు

NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తలసాని ప్రసాద్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బృంగి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.

February 20, 2026 / 02:12 PM IST

ఇందిరమ్మ గృహంతో నెరవేరిన కల

BHNG: రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో మమత గణేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, నకిరేకల్ నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 02:11 PM IST

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు’కు ఎంపిక

NLG: కనగల్ చెందిన సామాజిక సేవకురాలు డా. కంబాల శివలీల ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు-2026’కు ఎంపికయ్యారు. గత 12 ఏళ్లుగా ఆమె చేస్తున్న సామాజిక సేవలను గుర్తిస్తూ వాజ్‌పేయి-అద్వాని సేవా సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 22న ఉయ్యాలవాడ వర్ధంతి సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా ఈ అవార్డును అందజేయనున్నారు. సంస్థ వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 02:11 PM IST

‘రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలి’

VZM: ప్రతిఒక్కరూ విధిగా తమ విధులు బాధ్యతలను తెలుసుకోవాలని గజపతినగరం జడ్జి ఏ.విజయ రాజ్‌ కుమార్‌ సూచించారు. శుక్రవారం స్దానిక బోడసింగిపేటలో ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలని చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 02:10 PM IST

సైబర్ నేరగాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై

KDP: ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ముద్దనూరు ఎస్సై ఎన్. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ముద్దునూరు మండలం కండ్లోపల్లి గ్రామంలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా అనుమాన వ్యక్తులు కనబడితే 112కి సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.

February 20, 2026 / 02:10 PM IST

ఒవైసీ బ్రదర్స్‌కి రాజాసింగ్ సవాల్

TG: MIM కీలక నేతలు ఓవైసీ బ్రదర్స్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీకి 15 నిమిషాలు ఇస్తే హిందువులు లేకుండా చేస్తాను అన్నారని గుర్తు చేశారు. వారికి 15 గంటలు, 15 రోజులు, 15 నెలలు ఇచ్చినా ఏం చేయలేరని ఎద్దేవా చేశారు. కానీ,  తమకు ఐదు నిమిషాలు ఇచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఎక్కడకి రావాలో చెప్పు అని సవాల్ విసిరారు.

February 20, 2026 / 02:10 PM IST

‘అభివృద్ధిపై చర్చకు సిద్ధం’

SRCL: వేములవాడ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలు నిమ్మశెట్టి విజయ్, కందుల క్రాంతికుమార్, వెంగళ శ్రీకాంత్ గౌడ్ సవాల్ విసిరారు. వేములవాడలో వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. వేములవాడలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనరసింహారావుపై ఆరోపణలు చేస్తే ఊరుకోమని అన్నారు.

February 20, 2026 / 02:07 PM IST

విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న పరిటాల శ్రీరామ్

సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం మల్లాకాల్వ గ్రామంలో నిర్వహించిన లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో జరిగిన ప్రతిష్ఠాపన వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

February 20, 2026 / 02:07 PM IST

చెన్నై నుంచి ముంబైకి ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టిన ప్రభాస్

‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను అప్పుడప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతానని చెప్పాడు. ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబై‌లో జరుగుతున్నప్పుడు చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ చేశానని, టీం అంతా షాక్ అయిందని అన్నాడు. ఫ్లైట్‌లో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి ‘మీరు మాములు వాళ్లు కాదండి అన్నాడు’ అని చెప్పాడు.

February 20, 2026 / 02:06 PM IST